GHMC: జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం గడువుకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి, 2021 ఫిబ్రవరి 11న మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పాలక మండలి ఇంకా కేవలం 85 రోజులు (ఫిబ్రవరి 10వ తేదీ) ఆమె, కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ నెల 21వ తేదీన స్టాండింగ్ కమిటీ, 25న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీతో జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు ముగియనున్నందున జీహెచ్ఎంసీకి మళ్లీ షెడ్యూల్ ప్రకారం మళ్లీ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకు ఛాన్స్ లేకపోవచ్చునన్న సమాధానాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 10 తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలనను తీసుకొచ్చి, ఇప్పటికే ప్రతిపాదించి, మంజూరు చేసిన అభివృద్ధి పనులను పరిగెత్తించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
జీహెచ్ఎంసీకి ఎన్నికలు
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లకు మూడు ముక్కలుగా జీహెచ్ఎంసీని విభిజించాలన్న విషయంపై ఇప్పటికే సాధ్యాసాధ్యాలను సర్కారు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సర్కార్ స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టనున్నందున జీహెచ్ఎంసీకి ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాల్లేవని తెలుస్తుంది. ముఖ్యంగా సిటీలో సర్కారు ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేసిన హెచ్ సిటీ పనులు ఇంకా గ్రౌండింగ్ కాకపోవడం, ఒక్క ప్రాజెక్టు కూడా పనులు ముందుకు సాగకపోవడంతో సర్కార్ ఏడాది సమయం తీసుకుని, హెచ్సిటీ పనులు విజుబిలిటీ స్థాయికి వచ్చిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?
జనవరిలో వార్షిక బడ్జెట్పై మళ్లీ కౌన్సిల్?
జీహెచ్ఎంసీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సుమారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–-27) ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలు రూ.10 వేల కోట్ల మార్కును దాటే అవకాశాలున్నాయి. రూ.11 వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ మహా బడ్జెట్పై జనవరి నెలాఖరులో మరోసారి మేయర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రతిఏటా నవంబర్10వ తేదీలోపు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు ప్రవేశపెట్టాలని ఉన్నందున, ఈ సారి కాస్త ఆలస్యమైనా 25న జరగనున్న స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ రూపకల్పన ప్రస్తావన వచ్చే అవకాశముంది. అక్కడి నుంచి పాలక మండలి అధికార గడువు ఫిబ్రవరి 10 ముగియనున్నందున జనవరి నెలాఖరులో మేయర్ తన ప్రత్యేక విచక్షణాధికారాలను వినియోగించి, బడ్జెట్పై స్పెషల్ కౌన్సిల్ నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.
Also Read: Konda Surekha: భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కల్యాణం

