Teachers Unions: ఢిల్లీలో ధర్నాకు ఉపాధ్యాయ సంఘాల పిలుపు
Teachers Unions (imagecredit:swetcha)
Telangana News

Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?

Teachers Unions: టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ విద్యావిధానం రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలపై ఎస్టీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 2026 జనవరి 29న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎన్ భార్తి, చావ రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పాలకులు కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తున్నారని, పేదలను చదువుకు దూరం చేస్తున్నారని ఎస్టీఎఫ్‌ఐ నాయకులు విమర్శించారు. అశాస్త్రీయ అంశాలు ఉన్న జాతీయ విద్యావిధానం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ బాధ్యత ప్రభుత్వమే చూడాలని, కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను తక్షణమే మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Also Read: Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు

పునరుద్ధరణ తప్పనిసరి 

2004 నుంచి అమలులో ఉన్న నూతన పెన్షన్ విధానం కార్పొరేట్లకు లాభం తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఎస్టీఎఫ్‌ఐ నేతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ ఉన్న యూపీఎస్, జీపీఎస్, సీపీఎస్ లాంటి స్కీమ్స్ ఎస్టీఎఫ్‌ఐకి అంగీకారం కావని పేర్కొన్నారు. తక్షణమే పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నాంపల్లి హిందీ ప్రచారసభ కార్యాలయంలో ఆదివారం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌యూపీపీటీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ మాట్లాడుతూ, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ టెట్ తప్పనిసరి అయితే, భాషోపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించాలని కోరారు.

Also Read: Sukma Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు