BJP MP Etela Rajender(image credit:)
హైదరాబాద్

BJP MP Etela Rajender: రెచ్చగొట్టావు.. రివేంజ్ అంతకు మించి.. దాడిపై ఈటల!

BJP MP Etela Rajender: జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడులపై భారతదేశం అంతటా ఆగ్రహావేశాలు మిన్నంటి పోతున్నాయి. కేవలం భారతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాడిని ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తూ పిరికి పందె చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రవాదులకు చంపేయ్యాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఎంపి ఈటల రాజేందర్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారని ఆయన తెలిపారు.

మోడీ చొరవతో కశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందని, అలాంటి చోట ఉగ్రమూకలు దాడి చేయడం అమానుష చర్యగా పేర్కొన్నారు. టూరిస్ట్ లను అన్యాయంగా చంపేశారని వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. భారత్ సహనాన్ని పరీక్షిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.

Also read: Raja Singh on Terror Attack: కశ్మీర్ లో కొనవద్దు.. తినవద్దు.. రాజాసింగ్ కామెంట్స్

పర్యాటకులనే కాకుండా యావత్ భారతదేశ గుండెలను గాయపరిచిందని, ఈచర్యతో దేశం అంతా ఆవేశంతో రగిలిపోతున్నారని, భారత్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. భాదితుల రక్తం వ‌ృధాగా పోదని వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్