Mobile Recovery 9 image crdit: swetcha reporter)
హైదరాబాద్

Mobile Recovery: 45 రోజుల్లో 827 మొబైల్ ఫోన్ల స్వాధీనం

Mobile Recovery: సెల్​ ఫోన్ చోరీ అయినా.. పోగొట్టుకున్నా వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్​) ముత్యంరెడ్డి (‘ DCP Muthyam Reddy )సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కూడా కంప్లయింట్ ఇవ్వవచ్చని చెప్పారు. సైబరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్​ పోలీసులు 45 రోజుల్లో 2కోట్ల రూపాయల విలువ చేసే 827 మొబైల్​ ఫోన్లను రికవరీ చేశారు. సైబరాబాద్ పోలీస్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని బాధితులకు అప్పగించారు.

 Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!

6,233 సెల్​ ఫోన్లను రికవరీ

ఈ సందర్భంగా డీసీపీ ముత్యం రెడ్డి (DCP Muthyam Reddy)మాట్లాడుతూ, సెల్ ఫోన్లలో ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం ఉంటుందన్నారు. వేరే వారి చేతుల్లోకి ఈ సమాచారం చేరితే చెడు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దానికి తోడు చోరీ అయిన, పోగొట్టుకున్న ఫోన్లను అసాంఘిక శక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పారు. ఎనిమిది విడతల్లో సైబరాబాద్ పోలీసులు మొత్తం 6,233 సెల్​ ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించినట్టు తెలిపారు. ఇక, సైబర్ నేరాలపట్ల ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సెల్​ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని చెప్పారు. ఏపీకే ఫైళ్లను డౌన్​ లోడ్ చేయవద్దన్నారు. సైబర్​ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్​‌కు ఫోన్​ చేసి ఫిర్యాదు ఇవ్వాలన్నారు. దాంతోపాటు cybercrime.gov.in అన్న వెబ్ సైట్‌కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. సెల్​ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర వహించిన అదనపు డీసీపీ (క్రైమ్స్​) రామ్​ కుమార్​, సీసీఎస్​ ఏసీపీ నాగేశ్వరరావు, సీఐలు సంజీవ్, పవన్​, రవికుమార్​, డాలినాయుడు, రాజేశ్‌తోపాటు సిబ్బందిని అభినందించారు.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

Just In

01

Baahubali The Epic: అదరగొడుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతంటే?

Hydra: కూకట్‌పల్లి చెరువుకు పూర్వవైభవం హైడ్రా అద్భుతం.. స్థానికుల ఆశ్చర్యం

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆర్టీసీ ఢీ.. స్పాట్లో 17 మంది మృతి

Dude movie ott: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా!.. ఎక్కడంటే?

CM Revanth Reddy: బూత్ లెవెల్‌లో ప్రతీ ఓటరును కలవాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రివ్యూ