Cyber Crime (imagecredit:canva)
క్రైమ్

Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో యువకులు.. సైబర్ క్రిమినల్స్​ ఉచ్ఛులో నిత్యం… అదేపని

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో యువకులు దేశంగాని దేశం వెళ్లి సైబర్ క్రిమినల్స్​ ఉచ్ఛులో చిక్కుకుంటున్నారు. నిత్యం చిత్రహింసలు అనుభవిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సైబర్ మోసాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నపుడు కొందరు యువకులు తమ తమ ఇళ్లకు చేరుతున్నా ఇప్పటికీ వేలాది మంది సైబర్​ నేరగాళ్ల చేతుల్లో నుంచి తప్పించుకోలేక నానా యాతనలు పడుతున్నారు.

స్పెషల్​ బ్రాంచ్​ కు చెందిన ఓ సీనియర్​ పోలీసు అధికారి తెలిపిన ప్రకారం గడిచిన రెండేళ్లలో విజిటింగ్​ వీసాపై కాంబోడియా, థాయ్​ లాండ్​, మయన్మార్, వియత్నాం దేశాలకు వెళ్లిన దాదాపు 30వేల మంది భారతీయుల ఆచూకీ దొరకటం లేదు. వీళ్లంతా సైబర్​ బానిసత్వంలో ఉండి ఉంటారని ఆ అధికారి చెప్పారు.

సోషల్​ మీడియా..

ప్రధానంగా డేటా ఎంట్రీ ఆపరేటర్​ ఉద్యోగాల పేర యువకులను ట్రాప్​ చేస్తున్న సైబర్​ క్రిమినల్స్​ ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రాం, టెలిగ్రాం తదితర యాప్​ ల ద్వారా పని కానిస్తున్నారు. నెలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల జీతం ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి అంటూ తమ వివరాలు ఇస్తున్నారు. విదేశీ ఉద్యోగం మోజులో కాంటాక్ట్​ చేసిన వారిని విజిట్​ వీసాలపై మా వద్దకు వచ్చేయండి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటామని చెప్పి పిలిపించుకుంటున్నారు.

ఏజెంట్ల ద్వారా.. 

సోషల్​ మీడియాలో వస్తున్న ఆఫర్లను చూసి కొందరు యువకులు సైబర్​ క్రిమినల్స్​ ట్రాప్​ లో పడుతుంటే మరికొన్నిసార్లు ఏజెంట్లు తెలిసి తెలిసి పలువురు యువకులను విదేశీ ఉద్యోగాల పేర సైబర్ క్రిమినల్స్​ వద్దకు చేరుస్తున్నారు. రెండు నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుని పాస్​ పోర్ట్​, వీసా సమకూర్చి ఆయా దేశాల్లోని సైబర్​ నేరగాళ్ల వద్దకు పంపిస్తున్నారు.

వచ్చీరాగానే.. 

ఇలా ఉద్యోగం మోజులో తమ వద్దకు చేరుతున్న యువకుల నుంచి సైబర్​ క్రిమినల్స్​ ముందుగా పాస్ పోర్టులు, వీసాలు తీసేసుకుంటున్నారు. ఆ తరువాత సిటీలు, గ్రామాలకు దూరంగా నిర్జన ప్రదేశాల్లో తాము ఏర్పాటు చేసుకున్న సైబర్​ కేప్​ లకు తరలిస్తున్నారు. ఎన్ని రకాలుగా సైబర్​ నేరాలు చేయవచ్చన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం మన దేశానికి చెందిన వారిని టార్గెట్​ చేయిస్తూ నేరాలు చేయమంటున్నారు.

ఒప్పుకోకపోతే.. 

సైబర్​ నేరాలు చేయటానికి ఎవరైనా ఒప్పుకోకపోతే సైబర్​ క్రిమినల్స్​ వారికి నరకం చూపిస్తున్నారు. రోజుల తరబడి ఆహారం ఇవ్వకుండా గదుల్లో నిర్భంధిస్తున్నారు. కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదుతున్నారు. కరెంట్​ షాకులు పెడుతున్నారు. సైబర్​ క్రిమినల్స్​ చేతుల్లో చిక్కి సహాయం కోసం సోషల్​ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన కరీంనగర్​ జిల్లా వాసి మధుకర్​ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పాడు. సైబర్​ క్రిమినల్స్​ పెడుతున్న ఈ హింసలను భరించలేక చాలామంది ఇష్టం లేకున్నా సైబర్​ నేరాలు చేస్తున్నట్టు వివరించాడు.

భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. 

విదేశీ ఉద్యోగం మోజులో దేశంగాని దేశం వెళ్లి సైబర్ క్రిమినల్స్​ చేతుల్లో బందీలుగా మారి నిత్యం నరకం అనుభవిస్తున్న వారికి విముక్తి కల్పించటానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విషయం బయటపడినపుడు కాకుండా దీని కోసం నిరంతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్​ పోలీసు అధికారులు సైతం అంటున్నారు.

భారత విదేశాంగ శాఖ ఆయా దేశాల్లోని దౌత్య కార్యాలయాల సిబ్బందిని సమన్వయం చేసుకుని చొరవ తీసుకున్నపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇటీవల థాయ్​ లాండ్​ లో సైబర్​ క్రిమినల్స్ చేతుల్లో చిక్కిన 540 మంది భారతీయులకు విముక్తి దొరకటంలో (వీళ్లలో తెలంగాణకు చెందిన 24మంది యువకులు ఉన్నారు) భారత విదేశాంగ శాఖదే కీలక పాత్ర అని చెప్పారు.

Also Read; Cyber ​​Crime: సైబర్ కిలాడీ అరెస్ట్.. ఎలా అరెస్ట్ చేశారంటే?

ఇలా తమ దృష్టికి వచ్చినపుడే కాకుండా భారత విదేశాంగ శాఖ ఈ తరహా చర్యలను నిరంతరం తీసుకుంటే వేలాది మంది యువకులకు విముక్తి దొరుకుతుందన్నారు. అదే సమయంలో విదేశీ ఉద్యోగం అనగానే ముందూ వెనకా ఆలోచించకుండా యువకులు దేశంగాని దేశం వెళ్ల వద్దని సూచించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన వెబ్​ సైట్​ కు వెళ్లి వచ్చిన జాబ్​ ఆఫర్​ సరైందేనా? అన్న విషయాన్ని తనిఖీ చేసుకోవాలన్నారు.

ఉద్యోగం కోసం బయల్దేరి వెళ్లే ముందు ఆఫర్​ చేసిన విదేశీ కంపెనీ లేదా వ్యక్తిని లిఖితపూర్వక అగ్రిమెంట్ ఇవ్వాలని అడగాలని చెప్పారు. విద్యార్హతలు తక్కువగా ఉన్నా ఉద్యోగంలో పెట్టుకుంటామంటే అనుమానించాలన్నారు. ఇక, విదేశీ ఉద్యోగం మోజులో విదేశాలకు వెళ్లి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే 1930 నెంబర్​ కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. 

విదేశీ ఉద్యోగాల పేర యువకులను సైబర్ క్రిమినల్స్​ ఉచ్ఛులోకి నెడుతున్న ఏజెంట్లపై నిఘా పెట్టినట్టు సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్​ తెలిపారు. డబ్బు కోసం యువకులను నరకంలోకి నెడుతున్న పదిహేను మంది ఏజెంట్లను గుర్తించినట్టు చెప్పారు. వీరిలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్​ చేశామన్నారు. మిగితా తొమ్మిది మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. వీరిలో కొందరు విదేశాల్లో ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. ఈ అందరినీ కూడా అరెస్ట్​ చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Also Read; Zaheerabad Crime: జెహీరాబాద్ లో దారుణం.. ఒంటరిగా ఉన్నమహిళపై దాడి.. ఆపై

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?