Zaheerabad Crime: జెహీరాబాద్ లో దారుణం.. ఒంటరిగా ఉన్నమహిళపై దాడి.. ఆపై
Zaheerabad Crime (imagecredit:canva)
క్రైమ్

Zaheerabad Crime: జెహీరాబాద్ లో దారుణం.. ఒంటరిగా ఉన్నమహిళపై దాడి.. ఆపై

జహీరాబాద్ స్వేచ్ఛ: Zaheerabad Crime: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ లో ఆదివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జహీరాబాద్ ఎస్ఐ కాశినాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఝరాసంగం మండలం చిలేపల్లి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మి (47) గత 20 సంవత్సరాలుగా పస్తాపూర్ లో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగించుకుంటుంది.

ఆదివారం గుర్తు తెలియని వారు ఇంట్లోకి వచ్చి లక్ష్మి కంట్లో కారం చల్లి గ్యాస్ సిలిండర్ తో తలపై బాది దారుణంగా హత్య చేశారు. సంఘటన స్థలాన్ని జహీరాబాద్ సిఐ శివలింగం, ఎస్సై కాశీనాథులు పరిశీలించి హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రప్పించి హత్య జరిగిన ప్రాంతంలో నమోనాలను సేకరించారు.

లక్ష్మి హత్యకు గల కారణాలను అన్ని కోణాల నుంచి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శివలింగం తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Tiger Spotted Roaming: పెద్ద పులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?