Crime News: బొలెరో బైక్ ఢీకొన్న సంఘటనలో బాషా (22) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మఖ్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూత్పూర్ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బొలెరో వాహనం బైకును ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన పట్టించుకోకుండా వెళ్లిపోగా అటుగా వెళుతున్న కొందరు బాటసారులు ఈ సంఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: Municipal Elections: మున్సిపోల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!
చికెన్ వ్యాపారం కోసం..
మఖ్తల్ మండలం సత్యారం గ్రామానికి చెందిన బాషా(Basha) చికెన్ వ్యాపారనికై కావలసిన కోళ్ల కోసం మఖ్తల్(Kukthal) కు వస్తుండగా మఖ్తల్ నుండి సిమెంటులోడుతో ఆత్మకూరు(Athmakuru) వైపు వెళ్తున్న బోలోరో భూత్పూర్ రిజర్వాయర్ దిగువన డ్యాం క్రాసింగ్ దగ్గర వేగంగా బైకును ఢీకొనగా తలకు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మఖ్తల్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా ఒట్టేసి మరీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

