Revanth Reddy: ‘‘నా ఆలోచన ఒక్కటే ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేయాలి. చిన్న వయసులోనే దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. నా కంటే అర్హత, అనుభవం ఉన్న నాయకులు చాలామంది ఉన్నా దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇది అషామాషీగా వచ్చే అవకాశం కాదు. ఇది నాకు దేవుడు ఇచ్చిన బాధ్యతగా భావిస్తున్నా. ఈ కుర్చీలో ఉన్నంతకాలం తెలంగాణకు నష్టం వచ్చే చిన్న పనికూడా చేయను. ఇది దేవుడి మీద ఆన. ఎవరో తాడు బొంగురం లేనోళ్లు మాట్లాడారని కాదు. నా బాధ్యతగా ప్రజలకు చెబుతున్నా. దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివ్వను’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ (Telangana Assembly) సాక్షిగా మాట్లాడారు. శాసనసభలో నీళ్లు-నిజాలు అంశంపై జరిగిన చర్చలో శనివారం సాయంత్రం ఆయన సుధీర్ఘంగా మాట్లాడారు.
Read Also- Judge Inspection: కస్తూర్బా హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జడ్జి.. సంగారెడ్డిలో వెలుగులోకి నిజాలు
నాలుక కోస్తా..
తోలు తీస్తామంటూ నోటికొచ్చిన మాట్లాడితే నాలుక కోస్తామంటూ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పాలమూరుకు అన్యాయం చేసింది గత ప్రభుత్వమేనని విమర్శించారు. ఆధారాలతో తాను మాట్లాడుతున్నానని అన్నారు. కృష్ణ జలాల విషయంలో మరణ శాసనం రాసిందే కేసీఆర్, హరీష్ రావులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నానని, కానీ, సభకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ జలాల గురించి మాట్లాడితే రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు చెబుతారని భావించామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రెండేళ్లుగా సభకు రాకపోవటం విచారకరమని అన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు అవమానించినా సరే కాంగ్రెస్ నేతలు సభకు వచ్చి మాట్లాడేవారని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై చర్చను కేసీఆర్ తెరపైకి తెచ్చారని, కానీ వెంటనే అసెంబ్లీలో చర్చ చేపట్టామని, కానీ, సభకు రాలేదని విమర్శనాస్త్రాలు సంధించారు.
Read Also- MLC Kavitha: అమరుల కుటుంబాలకు కోటి అందే వరకు పోరాటం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్
బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2,130 టీఎంసీల నీటిని కేటాయించారని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేంద్రంతో జరిగిన సమావేశాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు పెట్టారు. పాత ఒప్పందమే శాశ్వతంగా ఉండేలా సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని జీవోలు ఉన్నాయి. 811 టీఎంసీలలో మాకు 490 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించాల్సిన కేసీఆర్, హరీష్ రావు.. మన హక్కులను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టుపెట్టారు. ఇందుకోసం 2015లో సంతకం పెట్టారు. అలా సంతకం చేసి తెలంగాణకు మొదటి మరణశాసనం రాశారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో గత పదేళ్ల కాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, పాలమూరుకు అనుమతి ఇవ్వాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.

