Judge Inspection: ఉడకని పప్పు.. మెనూకు తూట్లు
ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి
కస్తూర్బా హాస్టల్ ఆకస్మిక తనిఖీలో వెలుగు
జహీరాబాద్, స్వేచ్ఛ: ప్రభుత్వ నిబంధనలు, మెనూ ప్రకారం చాలా చోట్ల హాస్టళ్లలో విద్యార్థులకు భోజనం అందడం లేదు. ఉడకని పప్పుతో వడ్డిస్తున్నారు. నాణ్యత లోపించిన భోజనం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వైనం న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీలో (Judge Inspection) బట్టబయలు అయ్యింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్భా రెసిడెన్సియల్ వసతి గృహం, లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను శనివారం రాత్రి జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి జి. కవితా దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హాస్టల్లో న్యాయమూర్తి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం సరిగ్గా అందడంలేదని సిబ్బందిపై మండిపడ్డారు. పప్పు సరిగ్గా ఉడకకుండా ఉండడాన్ని గమనించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. అనంతరం లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్౨ను తనిఖీ చేశారు. అక్కడకు లబ్ధిదారులు ఏ సమస్యలపై అధికంగా వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పారా లీగల్ వాలంటీర్ ఇచ్చే సూచనలను పరిశీలించారు. ఈ ఆకస్మిక తనిఖీలో లీగల్ సర్వీసెస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also- Doctors Recruitment: గుడ్న్యూస్… త్వరలోనే డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

