Suicide Case: యజమాని వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి గొర్రెల కాపరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో కలకలం రేపింది. ఈ సంఘటనకు సంభందించి పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పురుగుల మందు తాగి
కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు నరసయ్య(Naradsaya) (55) గత నెల 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనీ పోలీసులు తెలిపారు. పురుగుల మందు తాగిన నరసయ్యను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వర్ధన్నపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్(Warangal) లోని ఎంజీఎం(MGM)ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న నరసయ్య ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: గత ప్రభుత్వ పాలకులు కవులను వాడుకుని వదిలేశారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
యజమాని దూషించడం వల్లే.. నా భర్త చనిపోయాడు
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నరసయ్య అదే గ్రామానికి చెందిన అడ్లూరి శ్రీనివాసరావు(Adlure Srinivasa Rao) వద్ద గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో యజమాని తరచూ దూషణలు, వేధింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య ఎల్లమ్మ(Yellama) తెలిపారు. మృతుడు భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపర్తి ఎస్సై ముత్యం(SI Muthyam) రాజేందర్ తెలిపారు.
MP Suresh Kumar: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుంది: జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్!

