Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!
Farmer Death (imagecreditswetcha)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!

Farmer Death: దౌల్తాబాద్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దౌల్తాబాద్(Daulatabad)మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య(Ellayya) అనే రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఎల్లయ్య(Ellayya) (50) కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలానికి నీరు అందించేందుకు మోటార్ స్టాటర్ డబ్బాను తీస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగి షాక్ తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఎల్లం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: India vs South Africa: చివరి టీ20లో టాస్ పడింది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే?

ఘటనపై కేసు నమోదు

ఈ ఘటనను గమనించిన పొలాల వద్ద ఉన్న రైతులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్లయ్య మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యవసాయ పనుల సమయంలో విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?