Cyber Fraud: కోట్లాది రూపాయల సైబర్ ఫ్రాడ్ (Cyber Fraud)కేసులో ఈడీ అధికారులు (ED Officers) విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం దేశంలోని మొత్తం 11చోట్ల దాడులు జరిపి విస్తృత తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో ఉంటూ నేరాలు చేస్తున్న ఓ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ తమను తాము పోలీసు అధికారులమని…మైక్రోసాఫ్ట్, ఆమెజాన్ కంపెనీ టెక్నికల్ సపోర్ట్ ఏజెంట్లమని నమ్మించి వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇలా లూటీ చేసిన డబ్బును బిట్ కాయిన్స్ గా మార్చారు.
Also Read: Tollywood Hero: ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశారు.. కట్ చేస్తే, ఇప్పుడు పాన్ ఇండియా ఆ హీరోకి దాసోహం!
అనంతరం అమెరికన్ డాలర్లుగా మార్చి హవాలా ద్వారా యూఏఈకి (UAE money trail)చేర్చారు. ఇలా కొల్లగొట్టిన డబ్బుతో సైబర్ క్రిమినల్స్ 260 కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నట్టుగా దీనిపై కేసులు నమోదు చేసిన సీబీఐ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ గ్యాంగ్ భారత్ తోపాటు మరికొన్ని దేశాల్లో కూడా మోసాలు చేసినట్టుగా తేలింది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈ మోసాలపై ఈడీ అధికారులు (ED raids )కూడా ఈసీఐఆర్ జారీ చేశారు. నగదు తరలింపులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ (Money laundering) జరిగినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే బుధవారం ఢిల్లీ, నొయిడా, గురుగావ్, డెహ్రాడూన్ లలో మొత్తం 11చోట్ల దాడులు జరిపారు. తనిఖీలు జరిపి డిజిటల్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్లతోపాటు క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన ఎవిడెన్స్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. కేసు విచారణ కీలక దశలో ఉందని చెప్పిన ఈడీ అధికారులు దీంట్లో మరిన్ని అరెస్టులు ఉంటాయన్నారు.
Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు