Crime News: మహబూబాబాద్‌లో దారుణం.. ప్రైవైటు బస్సు బోల్తా?
Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: మహబూబాబాద్‌లో దారుణం.. బస్సు బోల్తా పడి 30 మందికి తీవ్రగాయాలు

Crime News: సికింద్రాబాద్ నుండి శైవ క్షేత్రం కురవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఓ ఫ్యామిలీ మొత్తం ఆలయానికి వస్తుండగా ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఖమ్మం(Khammam), వరంగల్(Warangal) నేషనల్ 563 హైవేపై గుంతను తప్పించబోయిన డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతో బోల్తా పడింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. జాతీయ రహదారిపై నుంచి రోడ్డు పక్కకు ఒక్క సైడు పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరికీ గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బస్సు ఒకపక్కకు పడిపోవడంతో సీట్లు విరిగిపోయి, బస్సు అంత నుజు నుజ్జుగా మారిపోయిందని అక్కడి స్ధానికులు తెలిపారు.

అర్ధరాత్రి బస్సు బోల్తా..

కురవి వీరభద్ర స్వామి శైవ క్షేత్రానికి దర్శనం కోసం ఓ ప్రైవేట్ బస్సును మాట్లాడుకొని వస్తున్న హైదరాబాద్ కు చెందిన ఒకే ఫ్యామిలీ బస్సు బోల్తా పడడంతో అందరికీ గాయాలయ్యాయి. రాత్రి 12 గంటల సమయంలో మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గుంతను తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. గాయపడిన క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: advance release date strategy: కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ముందే ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు?.. ఫ్యాన్స్ కోసమేనా?

హైవే ప్రమాదాలకు బ్లాక్ స్పాట్..

ఖమ్మం(Khammam), వరంగల్ 563 నేషనల్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. గడిచిన ఏడాదికాలంగా పలు ప్రమాదాలు జరిగి గాయాల బారిన కొంతమంది పడితే, మరికొంతమంది మృతి చెందిన ఘటనలు సైతం ఉన్నాయి. మనవడి పుట్టు వెంట్రుకలు తీసి, కురవి వీరభద్ర స్వామి ఆలయంలో అభిషేకం చేయించేందుకు కుటుంబ సభ్యులతో అందరూ కురవికి బయలుదేరారు. ఇంతలోనే ఘటన జరగడం బాధాకరంగా ఉందని క్షతగాత్రులు వెల్లడిస్తున్నారు. ఈ నేషనల్ హైవేపై గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Maoist Posters: వడ్డీ వ్యాపారులారా ఖబర్దార్?.. భద్రాచలంలో మావోల పోస్టర్లు కలకలం

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం