Gold Rates (14-07-2025): బిగ్ షాకిచ్చిన గోల్డ్.. ఎంత పెరిగిందంటే?
Gold Rates (14-07-2025) (Image Source : Twitter)
బిజినెస్

Gold Rates (14-07-2025): బిగ్ షాకిచ్చిన గోల్డ్.. అమ్మో కొనలేమంటున్న మహిళలు

Gold Rates (14-07-2025): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, దేశంలో ఆర్థిక సమస్యల పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పనిసరి. శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి సంతోష పడతారు.

పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లి సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,800 గా ఉంది. పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా ధరలు తగ్గవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Kota Srinivasa Rao: లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు గురించి మీకేం తెలుసు.. ఇంట్రెస్టింగ్ విషయాలివే!

గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, నేడు భారీగా పెరిగాయి. దీంతో మహిళలు కూడా షాక్ అవుతున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 కి పెరిగి రూ.99,800 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 కి పెరిగి రూ.91,550 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,25,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.99,880

విజయవాడ ( Vijayawada) – రూ.99,880

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.99,880

వరంగల్ ( warangal ) – రూ.99,880

Also Read: Kota Srinivas Rao Death: కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా? అవకాశాలు అడిగినా ఇవ్వలేదా?

22 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.91,550

వరంగల్ ( warangal ) – రూ.91,550

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.91,550

విజయవాడ – రూ.91,550

Also Read: Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?

వెండి ధరలు

గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.19,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,25,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,25,000

విశాఖపట్టణం – రూ.1,25,000

హైదరాబాద్ – రూ.1,25,000

వరంగల్ – రూ.1,25,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

 

Just In

01

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు