Minister Ponguleti Srinivas: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలను మద్దులపల్లిలో వర్చువల్గా చేయనున్నారు. ఈ పర్యటనను పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు.
Also Read:,Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను.. ఫామ్ ల్యాండ్ వెంచర్లపై నియంత్రణ ఎక్కడ?
అభివృద్ధి పనుల వివరాలు
కూసుమంచి: 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన.
మద్దులపల్లి: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ మరియు నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం.
లింక్ కెనాల్: మున్నేరు – పాలేరు లింక్ కెనాల్ (గ్రావిటీ పథకం) నిర్మాణ పనులకు శంకుస్థాపన.
అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు.
మంత్రి పొంగులేటి పిలుపు..
ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.
Also Read: GHMC Property Tax: ట్యాక్స్ కలెక్షన్పై జీహెచ్ఎంసీ ఫోకస్.. పండుగ తర్వాత వసూళ్ల వేట!

