Hanumakonda District: వికలాంగ కుమారుడి వేదన తట్టుకోలేని..!
Hanumakonda District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Hanumakonda District: వికలాంగ కుమారుడి వేదన తట్టుకోలేని గుండేడ్ గ్రామం.. ఏం చేశారో తెలుసా..!

Hanumakonda District: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో కన్నీటి దృశ్యాలు కనిపించాయి. గ్రామానికి చెందిన జక్కుల వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం అగాధ విషాదంలో మునిగింది. పుట్టుకతోనే వికలాంగుడైన ఆయన కుమారుడు జక్కుల విజేందర్‌(Vijender)కు తండ్రి మృతితో జీవితం మరింత కఠినంగా మారింది. తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే ఆర్థిక స్థోమత లేక చివరకు గ్రామస్తుల సాయాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్

కుమారుడు కార్చిన కన్నీళ్లు

విజేందర్ వేదనను తెలుసుకున్న గ్రామస్తులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమ వంతు సహకారం అందించి జక్కుల వెంకటయ్య అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించారు. తండ్రి చితి ముందు నిలబడి కుమారుడు కార్చిన కన్నీళ్లు అక్కడున్న వారందరి హృదయాలను కదిలించాయి. తండ్రి చివరి ప్రయాణానికి అయినా గౌరవం దక్కింది అంటూ విజేందర్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సంఘటన గ్రామంలోనే కాదు సమాజమంతటినీ ఆలోచింపజేసేలా మారింది. పేదరికం వికలాంగత్వం మధ్య నలిగిపోతున్న ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు దాతలు అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Also Read: Plane Crash: ఆకాశంలో బ్యానర్ ప్రదర్శిస్తూ సముద్రంలో కూలిన విమానం..

Just In

01

Telangana Assembly 2025: సీఎం రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

RSS Mohan Bhagwat: సమస్యల పరిష్కారం కేవలం చర్చలతో సాధ్యం కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Apple AirPods : యాపిల్ ఎయిర్‌పాడ్స్‌కు కలర్ వెర్షన్ వస్తుందా?

CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

Elon Musk: కెనడా వైద్యుల నిర్లక్ష్యం.. భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు