Double bedroom scam: డబుల్ బెడ్రూం ఇండ్ల పేర జనం నుంచి లక్షలు వసూలు చేసిన ఇద్దరిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ మట్టయ్యతో కలిసి మీడియా సమావేశంలో వివరాల వెల్లడించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన విజయ్ (35) ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంత నివాసి అంబం మురళి (54)తో అతనికి పరిచయం ఉంది.
Also Read: Double Bed House Scam: డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కుంభకోణంలో మరో కేసు
అసిస్టెంట్ డైరెక్టర్ అని పరిచయం
ఇదిలా ఉండగా అక్టోబర్ నెలలో గన్ ఫౌండ్రి ప్రాంతంలో జరిగిన ముదిరాజ్ సామాజిక వర్గం సమ్మేళనంలో విజయ్ కి బడీచౌడీ వాస్తవ్యురాలు, సామాజిక కార్యకర్త అయిన సరస్వతితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులతో పరిచయాలు ఉన్నట్టుగా మురళి చెప్పుకొన్నాడు. ఆ తరువాత మురళిని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అని పరిచయం చేశాడు.
39లక్షలు వసూలు
తమ పలుకుబడితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి సరస్వతి నుంచి డబ్బు తీసుకున్నారు. ఆమె ద్వారా ఆర్టీసీలో పని చేస్తున్న మరో 18మంది నుంచి మొత్తం 39లక్షలు వసూలు చేశారు. అయితే, ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించలేదు. ఒత్తిడి చేసిన వారికి ఇండ్లు అలాట్ అయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఈ మేరకు సరస్వతి ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన సీఐ నర్సింహ విచారణ మొదలు పెట్టి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Also Read: Double Bedroom Scam: ఇల్లు ఇప్పిస్తామని రూ.30 లక్షలు వసూలు

