Jaanvi Kapoor | పాపం.. భామకి కొత్త చిక్కులు
New Complications For Actress Janhvi Kapoor
Cinema

Jaanvi Kapoor: పాపం..భామకి కొత్త చిక్కులు

New Complications For Actress Janhvi Kapoor: మనం అనుకున్నవన్నీ జరగవు. జరిగేవాటిని మనం ముందుగానే ఊహించలేం. ఎందుకంటే ఇది జీవితం కాబట్టి. అచ్చం ఓ నటి విషయంలోనూ సేమ్‌ టూ సేమ్‌ సీన్‌ జరిగింది. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారుసురాలిగా అరంగేట్రం చేసింది జాన్వీకపూర్. ఈమె తండ్రి బోనీకపూర్‌ హిందీతో పాటు కొన్ని తమిళ మూవీస్‌ని నిర్మించారు. ఈ మధ్య అజిత్‌ హీరోగా తుణివు వంటి విజయవంతమైన మూవీని సైతం నిర్మించారు.

కాగా బాలీవుడ్‌లో నటిగా పరిచయమై రాణిస్తున్న జాన్వీకపూర్‌కు తన తల్లి మాదిరిగానే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యాక్ట్ చేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ. ఈ విషయాన్ని పలుసార్లు ఆమె స్వయంగా రివీల్ చేసింది. అలాగే టాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. దేవర మూవీలో టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నాయకిగా యాక్ట్ చేస్తుంది. త్వరలో రామ్‌చరణ్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. ఇకపోతే కోలీవుడ్‌లో కూడా నటించాలని జాన్వీకపూర్‌ చాలా ఆశగా ఉందట. అలా ఒక పాన్‌ ఇండియా మూవీలోనూ యాక్ట్ చేయడానికి కమిట్‌ అయ్యింది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రూపొందనుందనని తెలుస్తోంది. కాగా మహాభారతం ఇతివృత్తంతో సాగే ఈ మూవీకి కర్ణ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టాక్‌.

Also Read: మలేసియాలో వండర్ రియాక్షన్‌

ఇందులో కర్ణుడిగా హీరో సూర్య యాక్ట్ చేస్తున్నారని, ఆయనకు జంటగా నటి జాన్వీకపూర్‌ ఎంపికైనట్టు ప్రచారం జోరుగా సాగింది. త్వరలో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. ఉన్నట్టుండి ఏమైందో గానీ ఇప్పుడీ మూవీ డ్రాప్‌ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక ఇదే విషయం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే తాజాగా హీరో విజయ్‌తో మరో మూవీతో జాన్వీకపూర్‌ నాయకిగా చేయనున్నట్లు టాక్‌. అయితే ఈ ప్రచారం అయినా నిజం అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడకతప్పదు.

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి