Hyderabad: వేలంలో కొత్త చరిత్ర.. ఎకరం రూ.137 కోట్లు!
Hyderabad (Image Souurce: Twitter)
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్ సరికొత్త చరిత్ర.. ఎకరం రూ.137 కోట్లు.. హెచ్ఎండీఏ వేలంలో రికార్డు ధర

Hyderabad: హైదరాబాద్ లో హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. వేలంలో ఎప్పుడు లేని విధంగా ఎకరం రూ.137.25 కోట్ల ధర పలికింది. కోకాపేటలోని నియోపోలిస్ లేఔట్లలోని భూములను హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ప్లాట్ నెంబర్ 17, 18 లోని 4.59 ఎకరాలు, 5.31 ఎకరాలకు వేలం నిర్వహించారు. మెుత్తం 9.90 ఎకరాల భూమికి వేలం నిర్వహించగా.. రూ.1,355.33 కోట్లకు అది అమ్ముడుపోయింది.

భూముల కోసం పోటా పోటీ

కోకాపేట నియో పోలిస్ భూములు కొనుగోలు చేసేందుకు 85 మందికి పైగా డెవలపర్లు ఆసక్తికనబరిచారు. ఒక్కో ఎకరానికి ఏకంగా రూ.99 కోట్ల ఆఫ్ సెట్ ధరను నిర్ణయించినప్పటికీ భూమిని సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. ఫ్లాట్ నెం.17 లో 4.59 ఎకరాల ల్యాండ్ కు రూ.626.53 కోట్ల బిడ్ వచ్చింది. దీని ప్రకారం ఎకరం ధర రూ.136.50 కోట్లుగా ఉంది. ఇక ఫ్లాట్ నెం.18లోని 5.31 ఎకరాల భూమిని వేలంలో రూ.728.8 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లెక్కన ఎకరం రూ.137.25 కోట్లు పలికింది. కోకాపేట ఫేజ్ – 3 వేలంలో భాగంగా ఇవాళ రెండు ప్లాట్లను మాత్రమే వేలం వేశారు. నవంబర్ 28, డిసెంబర్ మూడు తేదీల్లోనూ మిగతా ప్లాట్లకు సంబంధించి వేలం నిర్వహించనున్నారు. ఫేజ్ – 3లో మెుత్తం 25 ఎకరాల భూమిని హెచ్ఎండీఏ వేలం వేయనుంది.

ఫేజ్ -1, 2 ఎలా జరిగిందంటే?

కోకోపేట నియో పోలీస్ పరిధిలోని ప్రభుత్వ భూమికి గతంలో రెండుసార్లు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. 2021 జూన్ లో ఫేజ్ 1 వేలం జరిగింది. మెుత్తం 49 ఎకరాలను వేలం నిర్వహించగా.. రూ.2000 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు ఫేజ్ – 2 వేలంను 2023 ఆగస్టులో నిర్వహించారు. ఈసారి 46 ఎకరాలను వేలం నిర్వహించగా హెచ్ఎండీఏకు రూ.3,300 కోట్ల ఆదాయం లభించింది. మెుత్తంగా చూస్తే ఫేజ్ – 1,2 లో 95 ఎకరాలను వేలం నిర్వహించారు. ఫేజ్ – 3 పూర్తయ్యాక మొత్తం వేలం వేయబడిన భూమి 120 ఎకరాలకు చేరుకోనుంది.

Also Read: ESI Hospital: ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. కూలిన సెంట్రింగ్.. ముగ్గురు కార్మికులు మృతి

డెవలపర్ల ఆసక్తికి కారణాలు

కోకాపేట నియోపోలిస్ లో ఒక ఎకరాన్ని రూ.వందల కోట్లు పెట్టి డెవలపర్లు కొనుగోలు చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇదే కావడం గమనార్హం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఉండటం, భూమి ధరలు నిరంతరం పెరుగుతుండటం, హై-రైజ్ కమర్షియల్ ప్రాజెక్టులు, మిక్స్‌డ్ యూజ్ డెవలప్మెంట్‌కు అనుకూలమైన ప్రాంతం కావడంతో ఇక్కడి ల్యాండ్ కొనుగోలు చేసేందుకు డెవలపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ వేలంలోనూ రికార్డు ధరలు నమోదవుతు వస్తున్నాయి.

Also Read: Gen Z Daters: జెన్ జెడ్ ప్రేమికులపై షాకింగ్ సర్వే.. ఏఐ టూల్స్ ఉపయోగించి.. సీక్రెట్‌గా ఆన్ లైన్‌లో..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?