Medak District: ట్రిపుల్ ఆర్ భూసేకరణ నోటీసులపై రైతులు ఆగ్రహం
Medak District (imagecredit:swetcha)
మెదక్

Medak District: బలవంతంగా భూసేకరణ.. కన్నెర్ర చేసిన రైతులు.. అధికారులను బంధించి..!

Medak District: ట్రిపుల్ ఆర్ రోడ్డు కు సంబంధించి అవసరమైన భూ సేకరణకుగాను చౌటకూర్(Chautakur) మండలం శివ్వంపేట(Shivampet) గ్రామములో నోటీసులు అందజేయడానికి వెళ్లిన ఆర్ ఐ ప్రమోద్(RI Pramod), జిపిటీ ప్రవీణ్(GPT Praveen) లను రైతులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గంట సేపు నిర్బంధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also Read: Danam Nagender: దానం నాగేందర్ రాజీనామా? అనర్హత కంటే ముందే చేసే యోచన!

రైతులు ఆగ్రహం

ఎకరాకు రూ.16 లక్షలు చెల్లించేందుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా భూమి రూ.కోటి పలుకుతుంటే రూ.16 లక్షలు ఇస్తామంటే ఒప్పుకోమని, భూమికి భూమి లేదా రూ.కోటి రూపాయలు ఇస్తేనే నోటీసులు తీసుకుంటామని రైతులు తెలుపగ అది మా ఫరిది కాదని తెలపడంతో ఆగ్రహించిన రైతులు అధికారులను బలవంతంగా పంచాయతీ కార్యాలయంలోకి లాక్కెళ్లి బంధించారు. విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనీల్ కుమార్(CI Anil Kumar) పోలీసు సిబ్బందితో శివంపేటకు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు సీఐతో రైతులు వాగ్వాదానికి దిగారు. తాను ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సీఐ సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎట్టి పరిస్థితుల్లోను రూ.16 లక్షలకు విలువైన భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా రైతులు తెలిపారు.

Also Read: Tejas Fighter Crash: దుబాయి ఎయిర్ షోలో భారీ ప్రమాదం.. కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?