Sabarimala Special Trains ( Image Source: Twitter)
జాతీయం

Sabarimala Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. 60 స్పెషల్ ట్రైన్స్.. బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?

Sabarimala Special Trains: శబరిమల యాత్ర సీజన్ సందర్భంగా భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేరళలోని కొల్లం వరకు 60 ప్రీ-శబరిమల ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ రైళ్లు ఎప్పటి నుంచి నడుస్తాయంటే?

ఈ ప్రత్యేక రైళ్లు 2025 నవంబర్ నుండి 2026 జనవరి వరకు నడుస్తాయి. ప్రతి ఏడాది శబరిమల యాత్ర సమయంలో భారీగా భక్తులు ప్రయాణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

రైళ్ల మార్గాలు & ముఖ్య వివరాలు

మచిలీపట్నం – కొల్లం (10 ట్రిప్స్)

ట్రైన్ నంబర్: 07101 / 07102

మార్గం: గూడూరు, రేణిగుంట మార్గం

ముఖ్య స్టేషన్లు: విజయవాడ, సేలం, ఎరోడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం టౌన్, కోట్టాయం, చెంగన్నూర్ వంటి ముఖ్య రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

Also Read: Nizamabad Crime: రియల్ ఎస్టేట్‌లో మాఫియా లేడి.. నమ్మించి రూ.లక్షల్లో వసూలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

1. మచిలీపట్నం – కొల్లం (10 ట్రిప్స్)

ట్రైన్ నంబర్: 07103 / 07104

రూటు : గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట

స్టాపేజీలు: మార్కాపుర్ రోడ్, ఎరోడ్, అలువా

వెనుతిరుగు ప్రయాణంలో: డిగువమేట్టా వద్ద అదనపు హాల్ట్

Also Read: Telangana Road Accidents: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చర్యలు శూన్యం.. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో విఫలం

2. నరసాపురం – కొల్లం (20 ట్రిప్స్)

ట్రైన్ నంబర్: 07105 / 07106

రూటు : విజయవాడ, గూడూరు, రెనిగుంట

హాల్ట్‌లు: భీమవరం, పాలకొల్లు, తిరుప్పూర్, కోట్టాయం

Also Read: Air Purifier: రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే!

3. చర్లపల్లి – కొల్లం (20 ట్రిప్స్)

ట్రైన్ నంబర్: 07107 / 07108

రూటు : గుంటూరు, గూడూరు, రెనిగుంట

ముఖ్య స్టేషన్లు: నల్గొండ, మిర్యాలగూడ, సేలం, ఎరోడ్, ఎర్నాకుళం టౌన్

భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు

ఈ ప్రత్యేక రైళ్లు శబరిమల యాత్రికుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా నడపబడుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందుగానే బుకింగ్‌లు చేసుకోవాలని, పూర్తి టైమ్‌టేబుల్ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

Just In

01

Vande Mataram: పెళ్లిలో వందేమాతర గేయం.. ఆసక్తికర సన్నివేశం

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్

Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?

Safety Pin: బంగారం కంటే ఖరీదైన పిన్నీసు.. ధర రూ.69,000 మాత్రమే.. షాక్‌లో నెటిజన్లు!

Delhi Airport: 300 విమానాలు ఆలస్యం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ల గందరగోళం