Ranglal Kunta Lake: భాగ్యనగరంలోని కాలుష్య కోరల్లో చిక్కుకున్న రంగలాల్కుంట(Rangalalkunta) సరస్సును పునరుద్ధరించడానికి బ్లూడ్రాప్ ఎన్విరో సంస్థ(Bluedrop Enviro Company) వినూత్నమైన గ్రీన్ టెక్నాలజీని రంగంలోకి దించింది. ఈ సరస్సు నీటి శుద్ధి, కాలుష్య నిర్మూలన కోసం సంస్థ బయోటెక్ అనుసంధానిత ఏరేషన్ టెక్నాలజీ (Biotech Integrated De-Stratifying Aeration Technology) అనే ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేస్తోంది. ఈ అధునాతన సాంకేతికత ఇంజినీరింగ్ చేసిన డీ-స్ట్రాటిఫైయింగ్ మైక్రో ఏరేషన్ వ్యవస్థలను ఉపయోగిస్తుంది. దీనిలో ఎంపిక చేసిన కూరగాయల ఆధారిత ఎంజైమ్లను ఉపయోగించి, వ్యర్థ కాలుష్య అణువులను విచ్ఛిన్నం చేస్తారు. ఈ ఎంజైమ్ల సహాయంతో కాలుష్య కారకాలు సూక్ష్మజీవులకు సాధారణ ఆహారంగా మారి, సహజ పద్ధతిలో, స్థిరంగా విచ్ఛిన్నమవుతాయి.
ప్రణాళికలో కీలక లక్ష్యాలు
బ్లూడ్రాప్ ఎన్విరో ఈ సాంకేతికత ద్వారా రంగలాల్కుంటలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ పరిష్కారాన్ని అమలు చేసిన మొదటి నెలలోనే సరస్సులోని దుర్వాసన పూర్తిగా తొలగిపోతుంది. మొదటి ఆరు నెలల్లో ఉపరితల కలుపు మొక్కలు, హానికర బ్యాక్టీరియాలను తొలగించి, ఈ-కోలి స్థాయులు అనుమతించదగిన పరిమితుల్లోకి తీసుకురాబడతాయి. అతి ముఖ్యంగా, ఈ టెక్నాలజీ అమలు చేసిన మొదటి సంవత్సరంలోనే సరస్సు అడుగున పేరుకుపోయిన సంవత్సరాల నాటి సేంద్రీయ బురద/మట్టి జీవ-జీర్ణక్రియ ద్వారా శుద్ధి చేయబడుతుంది. దీనివల్ల బురదను తవ్వి, తరలించి శుద్ధి చేయాల్సిన కోట్లు ఖర్చు పూర్తిగా ఆదా అవుతుంది. అంతేకాకుండా, సరస్సు నుంచి వచ్చే వికారం, లోహపు వస్తువుల క్షయానికి కారణమయ్యే హానికర ఉద్గారాలు సైతం తొలగిపోతాయి. ఈ ప్రక్రియ అంతిమంగా సరస్సులోని యూట్రోఫికేషన్ను నియంత్రించి, జలచరాలు, పక్షులు, మొక్కలు, స్వచ్ఛమైన గాలితో కూడిన జీవవైవిధ్యాన్ని తిరిగి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రంగలాల్కుంటలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే, దేశంలోని ఇతర కాలుష్య సరస్సుల శుద్ధికి ఇదొక ఆదర్శవంతమైన, స్థిరమైన నమూనాగా నిలుస్తుందని పర్యావరణ నిపుణులు విశ్వసిస్తున్నారు.
Also Read: Bhadrachalam: భద్రాచలంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు.. భూకంప జోన్లో ప్రాణాలకు రక్షణ కరువు!
ఆవిష్కరణకు, దాతృత్వానికి నిలువెత్తు రూపం
బ్లూడ్రాప్ ఎన్విరో సంస్థ కో-ఫౌండర్ శ్రీకాంత్ పాకాల ఆవిష్కరణ, దాతృత్వం రెండింటినీ మేళవించిన అరుదైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇంజనీర్ నుంచి దార్శనిక పారిశ్రామికవేత్తగా, పరోపకారిగా ఆయన ప్రయాణం, సమాజంలో సానుకూల మార్పును తీసుకురావాలనే, ప్రజలకు సహాయం చేయాలనే ఆయన స్థిర సంకల్పానికి బలమైన నిదర్శనం. దాదాపు పాతికేళ్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గడిపిన శ్రీకాంత్, ఎనిమిదేళ్ల క్రితం తన మాతృభూమి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సుదీర్ఘ ప్రవాసం తరువాత ఆయన ఇక్కడ చేస్తున్న విభిన్నమైన సేవలు, చేసిన కృషి, దేశం పట్ల ఆయనకు ఉన్న లోతైన నిబద్ధతను, ప్రేమను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బుద్ధిజీవిగా, వ్యాపారవేత్తగా, దాతగా ఆయన చూపిన కృషి.. వ్యవస్థాపక స్ఫూర్తిని, సామాజిక స్పృహను పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణాత్మక మార్పును ప్రోత్సహించడం మరియు వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయడంపై శ్రీకాంత్ నిరంతర దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
