Damodar Raja Narasimha: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సంగారెడ్డి జిల్లా కంది మండలం లో హరే కృష్ణ మూవ్మెంట్ అద్వర్యంలో ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణం లో భాగంగా నిర్వహించిన మహా నరసింహా హోమము , గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమము లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ … ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ లో శ్రీ శ్రీ రాధా కృష్ణ విగ్రహాలను ప్రతిష్టించి సనాతన ధర్మ మహోన్నత సంస్కృతిక వారసత్వాన్ని, విలువలను ప్రాచుర్యం లోకి తేవటానికి అద్భుత అధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు .
ఈ సందర్బంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆద్వర్యం లో 3 కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనర్సింహా , TGIIC ఛైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి గారితో కలసి ప్రారంభించారు . అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్ ను పరిశీలించారు . ఆధునిక వంట గదులను , స్నాక్స్ ,ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్ , కటింగ్ మెషిన్ లను పరిశీలించారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Damodar Raja Narasimha: రైతులకు మద్దతు ధరతోపాటు సన్నాలకు బోనస్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ
