Jangaon ( IMAGE Credit: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Jangaon: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్!

Jangaon : జనగమ జిల్లా విద్యాశాఖ పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ లంచం డిమాండ్ చేసి ఏసీబికి చిక్కాడు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొడకండ్ల మండలంలోని ఒక పాఠశాలలో భవనం నిర్మాణం చేపట్టిన వ్యక్తికి బిల్లులు చెల్లించడానికి అవసరమైన ఫైలును ముందుకు కదిలించడానికి 18 వేల రూపాయల లంచం కోరినట్టు సమాచారం. డబ్బులకోసం రమేష్ వేధిస్తుండడంతో విసిగిపోయిన పాఠశాల నిర్వాహకులు నేరుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. బాధితుని ఫిర్యాదులపై స్పందించిన ఏసీబీ అధికారులు విసిరిన వలలో చిక్కుకున్నాడు.

Also Read: Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!

రమేష్ రూ.8వేలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు

హనుమకొండలోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయంలో రమేష్ రూ.8వేలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రమేష్ అరెస్టుతో అధికార వర్గాల్లో కలకలం రేగింది. నిష్కళంకంగా ఉండాల్సిన విద్యా విభాగంలోనే ఇటువంటి అవినీతి బహిర్గతం కావడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. పాఠశాల భవిష్యత్తు కోసం మంజూరైన నిధులకే ముళ్లుపెట్టి లంచం కోరడం సిగ్గుచేటు అంటూ స్థానికులు మండిపడుతున్నారు.ఈ ఘటనతో జనగమ జిల్లా విద్యశాఖలో మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. లోతుగా విచారణ చేపడితే మరికొందరు అవినీతి అధికారుల పాత్ర బయట పడే అవకాశం ఉందని చర్చ సాగుతుంది.

 Also Read: OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?

Just In

01

Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌‌లో భారత్-పాకిస్థాన్ ఆడాలంటే జరగాల్సిన సమీకరణాలు ఇవే..

Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అలర్ట్ అయిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ

Warangal Land Scam: ప్రైవేట్ పట్టా చూపి ప్రభుత్వ భూమి కాజేసేందుకు కుట్ర చేసిన బడా వ్యాపారి

Prasads Multiplex: మేము బాధ్యత వహించలేము.. ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ రిక్వెస్ట్!

Panchayat Secretaries: డీపీఓల నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శులకు శాపం