Hyderabad Commissioner: బోనాలు సమీపిస్తున్న నేపథ్యంలో లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి ఆలయానికి హైదరాబాద్ (, Hyderabad) కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) వచ్చారు. శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీవీ ఆనంద్ (CV Anand) మీడియాతో మాట్లాడారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 120 ఏండ్లుగా ఈ ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Ujjaini Mahankali: అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ దంపతులు
పోలీస్ శాఖకు సహకరించాలి
నెలరోజులపాటు ప్రజలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. బోనాల సందర్భంగా జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా క్రైమ్ విభాగం పోలీసులు, షీ టీమ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజ, అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా తదితర అధికారులు ఛత్రినాక పోలీస్ స్టేషన్లో బోనాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: KTR vs Kavitha: కేటీఆర్ వర్సెస్ కవిత.. పార్టీ ఒకటే.. దారులు మాత్రం వేరే