Rythu Bharosa Celebations: మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రైతు భరోసా సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ప్రతి ఎకరాకు 6 వేల రూపాయలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్(Revanth) ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కోటి ముప్పై తొమ్మిది ఎకరాలకు సకాలంలో ప్రతి ఎకరాకు 6 వేల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఇట్టి రైతు భరోసా నిధులు అందించినందుకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు అన్ని గ్రామాల రైతు సోదరులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
Also Read: Meenakshi Natarajan: సీనియర్లు జూనియర్లు అనే తేడా ఉండొద్దు!
ప్రత్యేకంగా వారికి ధన్యవాదములు
ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy), తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం & ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి దనసరి అనసూయ సీతక్క(Seethakka) వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageshwar Rao), రెవెన్యూ శాఖ & గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivass Reddy) లకు రైతు సోదరులు ప్రత్యేకంగా వారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలిపారు.
రైతన్నలు సంబరాలు
కొత్తగూడ(Kothagudem)లో 16 కోట్ల 8 లక్షల రూపాయలు 9299 రైతన్నల ఖాతాదారులకు నేరుగా అకౌంట్లోకి పడ్డాయని చెప్పారు. రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతన్నలు సంబరాలు చేసుకున్నారు. ఆనంద వెల్లువలతో బాణాసంచా కాల్చిన కాంగ్రెస్(Congress) పార్టీ రాష్ట్ర నాయకులు మండల నాయకులు, కిసాన్ సెల్ విభాగం నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులు మహిళలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Also Read: Tejaswi Madivada: నేనింకా ఉన్నాను.. వాడు ఏమైపోయాడో? కౌశల్ని ఇలా అనేసిందేంటి?