Israel Iran War: అర్ధరాత్రి భీకర యుద్ధం.. దూసుకొచ్చిన 100 మిసైళ్లు!
Israel Iran War (Image Source: Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Israel Iran War: అర్ధరాత్రి భీకర యుద్ధం.. దూసుకొచ్చిన 100 మిసైళ్లు.. పరుగులు పెట్టిన జనం

Israel Iran War: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మద్య యుద్ధం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్.. ఎవరూ ఊహించని విధంగా ప్రతిస్పందనకు దిగింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ చేపట్టిన దాడుల్లో టెల్ అవీవ్, జెరూసలెంలో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

బాంబుల మోతతో దద్దరిల్లిన నగరం
ఇరాన్ ప్రధానంగా టెల్ అవీవ్ (Tel Aviv) నగరాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. శత్రుదేశం ప్రయోగించిన మిసైళ్లు నగరాన్ని కుదిపేశాయని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. సైరన్ల శబ్దం నగరమంతటా వినిపించిందని.. టెల్ అవీవ్ లోని కీలక ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది. మరోవైపు టెల్ అవీవ్ లోని కీలక ప్రాంతాల వైపునకు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. వాటిని గగనతంలోనే అడ్డుకునేందుకు ఇంటర్ సెప్టార్ క్షిపణులను ప్రయోగించినట్లు స్పష్టం చేసింది.

100పైగా మిసైళ్లు ప్రయోగం
టెల్ అవీవ్ లోని బహుళ అంతస్తుల భవనాలను ఇరాన్ మిసైళ్లు ఢీకొట్టిన దృశ్యాలు అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి. ఈ దాడుల్లో 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. పలు భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. 100కు పైగా దొసుకొచ్చిన డ్రోన్లు, మిసైళ్లలో చాలా వాటిని తమ గగనతల వ్యవస్థ కుప్పకూల్చాయని సైన్యం వెల్లడించింది. అయితే వాటిలో కొన్ని రక్షణ వ్యవస్థను అధిగమించి.. నగరాలవైపునకు చొచ్చుకు వచ్చాయని అంగీకరించింది. మరోవైపు ఇందుకు ప్రతీగా ఇజ్రాయెల్ సైతం శనివారం ఇరాన్ పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని మెహ్రాబాద్ ఎయిర్ పోర్ట్ (Mehrabad International Airport) తగలబడింది. ఇది ఇరాన్ సైనిక, సివిల్ కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అణుస్థావరాలపై దాడి
అంతకుముందు ఇజ్రాయెల్.. ఇరాన్ దేశంపై భారీ ఎత్తున దాడులకు దిగింది. అణు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు స్పష్టం చేసింది. ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై కూడా దాడి చేసినట్లు కూడా తెలిపింది. ఈ దాడుల్లో యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్స్, ఇతర మౌలిక సదుపాయాలు నాశనమైనట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఆరుగురు టాప్ మిలటరీ కమాండర్స్, తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డెఫ్రిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు.

Also Read: GHMC Engineers: బీనామీలతో పనులు దక్కించుకుంటున్న.. జీహెచ్ఎంసీ ఇంజినీర్లు!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?