Chicken Price Pakistan: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి దేశంలో విషాదాన్ని నింపింది. పర్యాటకులనే టార్గెట్ చేస్తూ వారిపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది మృతి చెందారు. పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలు విధించింది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ కు వెళ్లే సింధు జలాలను క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: CM Revanth On KCR: కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశారుగా!
ప్రస్తుతం, పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏది కొనాలన్నా పెరిగిన రేట్లు చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.140 గా ఉంది. ఇక లీటర్ పాలు అయితే రూ. 110 గా ఉంది. తినే రొట్టెలు అయితే రూ. 500 గా ఉంది. బియ్యం నుంచి తినే కూరగాయలు వరకు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక పండ్లు, చికెన్ల ధరలు అయితే ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం అక్కడ కేజీ చికెన్ ధర రూ.798, బియ్యం ధర. 339, గుడ్లు డజన్. 332, బ్రెడ్ 500 గ్రా. 161, అరటిపండ్లు కిలో రూ. 176, టమోటా కిలోరూ. 150, ఆలుగడ్డ కిలో 105, కిలో ఆపిల్ కేజీ. 288, పాలు లీటర్. 224, ఆరెంజ్ కిలో రూ.216 పలుకుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో అంటూ అక్కడి జనాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Amrutha Pranay : సంచలన వీడియో రిలీజ్ చేసిన అమృత ప్రణయ్.. ఇక నుండి న్యూ లైఫ్ స్టార్ట్ అంటూ..