Medak Tragedy9 image credit: twitter)
మెదక్

Medak Tragedy: మెదక్‌లో కలచివేసిన సంఘటన.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి, ఇద్దరు చిన్నారులు

Medak Tragedy: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి జాతీయ రహదారిపై గల వాగులో ఇద్దరు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన స్థానికులు తల్లిని కాపాడారు. ఇద్దరు పిల్లలు మాత్రం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాసాయిపేట‌కు చెందిన వడ్డేపల్లి మమతకు ఇద్దరు కూతుళ్లు.. పూజిత (7), తేజస్విని (5) ఉన్నారు. భర్త చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద ఉంటున్న మమత నాగులపల్లి రహదారిపై గల వాగులోకి ఇద్దరు పిల్లలతో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.

Om Prakash murder case: మాజీ డీజీపీ దారుణ హత్య.. పక్కా స్కెచ్ తో లేపేసిన భార్య, కూతురు

ఈ ఆత్మహత్యా ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మమతను స్థానికులు కాపాడారు. వాగులో దూకి చనిపోయిన చిన్నారులను ప్రత్యేక బృందాల ద్వారా తూప్రాన్ పోలీసులు బయటకు తీసుకొచ్చారు. తన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో మమత విలపించింది. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. తూప్రాన్ ఎస్ఐ సదానందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది