Musheerabad Murder Case [image credit swetcha repporter]
హైదరాబాద్

Musheerabad Murder Case: బంగారు గొలుసు అడిగాడు.. ప్రాణాలే పోయాయి!

Musheerabad Murder Case: కనిపించకుండా పోయిన వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఉదంతమిది. ఇచ్చిన బంగారు గొలుసును వాపస్​ అడిగినందుకు హతుని స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు వెల్లడైంది. కేసులోని మిస్టరీని ఛేదించిన ముషీరాబాద్​ పోలీసులు శనివారం నిందితున్ని అరెస్ట్​ చేశారు. సెంట్రల్​ జోన్​ డీసీపీ కే.శిల్పవల్లి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్​ లోని బాదాం నెస్ట్​ అపార్ట్​ మెంట్​ నివాసి గుణ్​ దీప్​ సింగ్​ (35) వ్యాపారి. ఆయన బంధువు సత్నామ్​ సింగ్​ (59). ఈనెల 4న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్నామ్ సింగ్ ఆ తరువాత ఆచూకీ లేకుండా పోయాడు.

అతని మొబైల్​ కూడా స్విచాఫ్​ కావటంతో ఆందోళన చెందిన గుణ్​ దీప్​ సింగ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువుల ఇళ్లతోపాటు పలు చోట్ల గాలించామని, అయినా సత్నామ్​ సింగ్​ ఆచూక తెలియదని పేర్కొన్నాడు. ఈ మేరకు మ్యాన్​ మిస్సింగ్​ గా కేసులు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సత్నామ్​ సింగ్​ ముషీరాబాద్​ ప్రాంతంలోని ఓ మెకానిక్​ వద్దకు వెళ్లినట్టుగా గుణ్​ దీప్ సింగ్​ ఫిర్యాదులో తెలిపిన నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషించారు.

Also Read: Mahesh Kumar Goud: తెలంగాణ దోపిడీకి బీజేపీ.. బీఆర్ఎస్ కుమ్మక్కు.. పీసీసీ చీఫ్ ఆగ్రహం!

దీని ద్వారా బోయిగూడలోని ఓ ఇంట్లోకి సత్నామ్​ సింగ్​ వెళ్లినట్టుగా నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు మూసి ఉన్న తలుపులను విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా తలపై బలమైన గాయాలతోపాటు కత్తిపోట్ల కారణంగా చనిపోయిన సత్నామ్​ సింగ్​ మృతదేహం వాటర్​ సంపులో కనిపించింది. స్థానికుల ద్వారా ఆ ఇంట్లో నయన్​ చంద్ర నాయక్​ ఉండేవాడని పోలీసులకు తెలిసింది.

వెంటనే హత్యగా కేసును మార్చిన పోలీసులు నయన్​ చంద్ర నాయక్​ కోసం వేట ప్రారంభించారు. డీసీపీ శిల్పవల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం కూడా నయన్​ చంద్ర నాయక్​ ను పట్టుకోవటానికి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అతను గోవాకు వెళ్లినట్టు తెలియటంతో ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది. కాగా, తనను పట్టుకోవటానికి పోలీసు బృందం వచ్చినట్టు తెలుసుకున్న నయన్​ చంద్ర నాయక్​ గోవా నుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చాడు.

Damodar Rajanarsimha: ఆహార నాణ్యతలపై కఠిన హెచ్చరికలు.. మంత్రి ఆకస్మిక పర్యటన!

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ వద్ద అతను ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకువెళ్లి నయన్ చంద్ర నాయక్​ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సత్నామ్ సింగ్​ ను తానే హత్య చేసినట్టుగా అతను అంగీకరించాడు. కొన్ని రోజుల క్రితం తనకు డబ్బు అవసరమై సత్నామ్​ సింగ్​ ను అడుగగా అతను బంగారు గొలుసు ఇచ్చినట్టు వెల్లడించాడు. దానిని కుదువబెట్టి డబ్బు తీసుకున్నట్టు తెలిపాడు.

అయితే, ఇటీవలిగా తన బంగారు గొలుసు కోసం సత్నామ్​ సింగ్ ఒత్తిడి చేస్తుండటంతో పథకం ప్రకారం ఇంటికి తీసుకెళ్లి హతమార్చినట్టు చెప్పాడు. నిందితున్ని అరెస్ట్​ చేయటంలో కీలకపాత్ర వహించిన ఏసీపీ ఎల్​.రమేశ్​, సీఐ రాంబాబు, ప్రత్యేక బృందంలోని సిబ్బందిని డీసీపీ శిల్పవల్లి అభినందించారు. అందరికీ త్వరలోనే రివార్డులు అందచేయనున్నట్టు తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు