RBI Monetary Policy 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India).. ఎంతో కీలకమైన వడ్డీ రేట్లను మరోమారు సవరించింది. రెపో రేటును వరుసగా రెండోసారి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రెపో రేటు (Repo Rate) 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే రెపో రేటును తగ్గించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు పెద్ద ఎత్తున బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేశాయి. వాటిని నిజం చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం విశేషం.
Also Read: Manchu War: ‘మంచు వార్’ మళ్లీ షురూ.. ఇంటి వద్ద మనోజ్ బైఠాయింపు.. జల్ పల్లిలో హై అలెర్ట్!
ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి భేటి అయ్యింది. ఈ సందర్భంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీసీ రెండో సమావేశంలోనూ 25 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డిరేట్లు తగ్గే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.