తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: LB Nagar Court verdict: మైనర్ బాలికపై లైంగిక దాడి జరిపిన కేసులో నిందితునికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి మంగళవారం తీర్పు చెప్పారు. చైతన్యపురి ద్వారకపురి నివాసి కాసర్ల మహేశ్ ఎలియాస్ బన్నీ (19) వృత్తిరీత్యా కూలీ. ఇదెలా ఉండగా రెండేళ్ల క్రితం తన ఇంటికి కొద్దిదూరంలోనే ఉంటున్న మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా లోపలికి వెళ్లిన మహేశ్ భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Also Read : Alluri district News: తల్లి ముందే బిడ్డను ఎత్తుకెళ్లిన కిలేడీ.. 5 గంటల్లో సీన్ రివర్స్!
బాధితురాలి ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాక్యూటర్లు సునీత, డీ.రఘు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి నిందితుడైన మహేశ్ కు 20 సంవత్సరాల జైలుశిక్షతోపాటు 5వేల రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి పరిహారంగా 5లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు