తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad News: చిన్న విషయమై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కాల్పులకు దారి తీసింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక వివరాలలోకి వులితే ఇలా ఉన్నాయి. రంజాన్ పండుగను పురస్కరించుకుని గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో దావత్ ఏ రంజాన్ ఎక్స్ పో నడుస్తోంది. ఎక్స్ పోలో భాగంగా నిర్వాహకులు అహమద్ పర్ఫ్యూం స్టాల్ ను ఏర్పాటు చేశారు. దీంట్లో యూఏఈకి చెందిన ఖల్సేకర్ తౌఫిక్, అజీజ్ షేక్, మోయిజ్ అహమద్ లు సేల్స్ మెన్లుగా పని చేస్తున్నారు.
ఇదిలా ఉండగా శనివారం ఉదయం 8.15 గంటల సమయంలో ఏసీ గార్డ్స్ నివాసి మహ్మద్ ఫర్ఖాన్ అహమద్ పర్ఫ్యూం బాటిల్లు కొనటానికి ఎక్స్ పోకు వచ్చాడు. అప్పటికే తౌఫిక్, అజీజ్ షేక్, మోయిజ్ లు సామాన్లన్నీ ప్యాక్ చేసి అక్కడి నుంచి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో షాపు మూసివేశామని, పర్ఫ్యూం సీసాలు ఇవ్వలేమని ఫర్ఖాన్ కు చెప్పారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన ఫర్ఖాన్ వారిని అసభ్యకర పదజాలంతో దూషించటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులకు ఫోన్లు చేశాడు.
Also Read: Banjara Hills police: ఇదేం పైత్యం.. రీల్స్ కోసం గన్ తో ఓపెన్ టాప్ జీపు ఎక్కి..
ఈ క్రమంలో ఫర్ఖాన్ స్నేహితులు పది మంది అక్కడికి చేరుకున్నారు. స్టాల్ నిర్వాహకులతో గొడవ పెట్టుకున్నారు. దాంతో స్టాల్ నిర్వాహకుడు ఎక్స్ పో ఆర్గనైజర్ కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. ఈ క్రమంలో ఆర్గనైజర్ సోదరుడు, పారామౌంట్ గార్డెన్ అపార్ట్ మెంట్ నివాసి హసీబుద్దీన్ హైదర్ తన మేనల్లుడు రియాసత్ తో కలిసి అక్కడికి వచ్చాడు. మాట్లాడుతుండగానే ఫర్ఖాన్ అతని స్నేహితులు రియాసత్ పై దాడి చేసి కొట్టారు. అడ్డుకోవటానికి ప్రయత్నించిన వలంటీర్ ఖైసర్ ను పక్కకు నెట్టేశారు.
దాంతో హసీబుద్దీన్ తన వద్ద ఉన్న లైసెన్సడ్ రివాల్వర్ తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఫర్ఖాన్ అతని స్నేహితులతోపాటు హసీబుద్దీన్, రియాసత్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. హసీబుద్దీన్ వద్ద ఉన్న రివాల్వర్ ను నోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Nizamabad Crime: తల్లి కోసమే హత్య? కారు డిక్కీ డెడ్ బాడీ కేసులో సంచలన నిజాలు..