Panjagutta Police Station (imagecredit:AI)
హైదరాబాద్

Panjagutta Police Station: ఈ పోలీస్ స్టేషన్ ఒక సంచలనం.. హైదరాబాద్ లో ఇదే హైలెట్..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Panjagutta Police Station: పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​ సంచలన కేసులకు కేరాఫ్​ అడ్రస్​ గా నిలుస్తోంది. బోదన్​ మాజీ ఎమ్మెల్యే కొడుకు చేసిన రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి హరీష్​ రావు, టాస్క్​ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్​ రావుపై ఇదే స్టేషన్​ లో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కేసులు నమోదయ్యాయి. తాజాగా బెట్టింగ్​ యాప్​ ల ప్రమోషన్​ విషయంలో 11 మంది యూ ట్యూబర్లు, ఇన్​ ఫ్లూయెన్సర్లపై కేసులు రిజిష్టర్‌ అయ్యాయి. గతంలో ఈ స్టేషన్​ లో పని చేస్తున్న సిబ్బందిలో ఒకేసారి 86మంది ట్రాన్స్​ ఫర్​ కావటం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట స్టేషన్​ తరచూ పతాక శీర్షికలకెక్కుతోంది.

ఎమ్మెల్యే కొడుకును తప్పించబోయి..

బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​ కొడుకు రహీల్​ 2023, డిసెంబర్​ లో మద్యం సేవించిన మత్తులో కారు నడుపుతూ సీఎం క్యాంప్​ కార్యాలయమైన ప్రజా భవన్​ ఎదురుగా ఉన్న ట్రాఫిక్​ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ నైట్​ డ్యూటీలో ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్​ కానిస్టేబుల్​ దీనిపై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి రహీల్​ ను స్టేషన్​ కు తరలించారు. అయితే, కేసులు అతనిపై నమోదు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే వద్ద డ్రైవర్​ గా పని చేస్తున్న ఓ యువకునిపై కేసులు పెట్టారు.

ఈ విషయం వెలుగు చూడటంతో వెస్ట్​ జోన్​ డీసీపీ విజయ్ కుమార్​ స్వయంగా కేసులో దర్యాప్తు జరిపారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యే కొదుకు యాక్సిడెంట్​ చేసినట్టుగా తేలటంతో రహీల్​ పై కేసులు నమోదు చేశారు కాగా, విచారణలో రహీల్​ ను స్టేషన్ కు తరలించిన రాత్రి బోదన్​ సీఐ ప్రేమ్​ కుమార్​ అప్పట్లో పంజాగుట్ట సీఐగా ఉన్న దుర్గారావుతో పలుమార్లు ఫోన్​ లో మాట్లాడినట్టు తేలింది. మాజీ ఎమ్మెల్యే షకీల్​ కూడా సీఐ దుర్గారావుతో మాట్లాడినట్టు నిర్ధారణ అయ్యింది.

AlsoRead: HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు

నేపథ్యంలో రహీల్​ ను కేసు నుంచి తప్పించి డ్రైవర్​ పై పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో అప్పట్లో హైదరాబాద్​ కమిషనర్​ గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డి సీఐ దుర్గారావును సస్పెండ్​ చేశారు. ఆ తరువాత రహీల్​ పై నమోదైన కేసు వివరాలు బయటి వ్యక్తులకు చేరుతున్నట్టు గుర్తించి స్టేషన్​ లో పని చేస్తున్న 86మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. ఇంతమందిని…అందులోనూ ఒకే స్టేషన్​ లో పని చేస్తున్న వారిని ట్రాన్స్​ ఫర్​ హైదరాబాద్​ పోలీస్​ హిస్టరీలో మొదటిసారి కావటం గమనార్హం.

హరీష్​ రావుపై కేసులు…

ఇక, మాజీ మంత్రి హరీష్​ రావు, టాస్క్​ ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై ఇదే స్టేషన్​ లో కేసులు నమోదు కావటం మరోసారి సంచలనం సృష్టించింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్​ అనే వ్యాపారి తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్​ చేశారంటూ గత సంవత్సరం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ మంత్రి హరీష్​ రావు సూచనల మేరకే టాస్క్​ ఫోర్స్​ మాజీ డీసీప రాధాకిషన్​ రావు తదితరులు ఈ పని చేసినట్టుగా పేర్కొన్నారు. తనను బెదిరించి డబ్బు కూడా డిమాండ్​ చేశారని తెలిపారు.

Also ReadMLA Sudheer Reddy: ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు.. మహిళ కార్పొరేటర్ పై ఆ వ్యాఖ్యలేంటి సార్..

మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి హరీష్​ రావు వద్ద పని చేసిన వంశీకృష్ణతోపాటు మరికొందరిని అరెస్ట్​ చేశారు. తాజాగా బెట్టింగ్​ యాప్​ లను ప్రమోట్​ చేసిన బుల్లితెర నటులు, ఇన్​ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు కావటంతో మరోసారి పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​ పతాక శీర్షికల్లోకి వచ్చింది. ఇలా వరుసగా సంచలనాత్మక కేసులు నమోదవుతుండటంతో తమపై విపరీతమైన పని భారం పడుతోందని స్టేషన్​ సిబ్బంది చెబుతున్నారు. ఆయా కేసుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు నిందితులుగా ఉండటంతో ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తోందన్నారు. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతోందని చెప్పారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్