R.Narayana Murthy: భారత దేశంలో విద్య సేవా రంగం నుంచి వ్యాపార రంగంగా మారింది. కష్టపడి చదువుతున్న పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్(University paper leak) అనే సినిమా ను ఆదరించాలని ప్రముఖ విప్లవ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి(R. Narayana Murthy) కోరారు. ఆయన హనుమకొండ(Hanumakonda) కాకతీయ యూనివర్సిటీ(KU) విద్యార్థులతో కలిసి మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
విద్యార్థులకు అన్యాయం
యూనివర్సిటీ(Univecity) స్థితి గతులపై రూపొందించిన సినిమా(Movie)నే యూనివర్సిటీలలో పేపర్ లికేజి అన్నారు. భారత్లో విద్యా రంగం(Education sector) వ్యాపార రంగంగా మారడమే కాకుండా పేదలకు అందనంత కాస్లిగా మారిందన్నారు. కష్టపడి చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంక్ లా ముసుగులో కొన్ని ప్రయివేట్(Private), కార్పొరేట్(Corporate) విద్యా సంస్థలు తల్లిదండ్రుల మైండ్ సెట్ మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: NIMS Fire Incident: అగ్నిప్రమాదంపై ఆధారాలు లేవా? దర్యాప్తుపై అనుమానాలు
ఆర్.నారాయణ మూర్తి డిమాండ్
గుజరాత్, ఒరిస్సా, ఢిల్లీ(Delhi), ఉత్తరప్రదేశ్(UP), లాంటి రాష్ట్రాల్లో పేపర్ లికేజి(paper leak) బయటకు వచ్చాయి. పేపర్ లికేజితో వైద్య ఉద్యోగం పొందిన వాళ్లు ఆపరేషన్ చేస్తే ప్రాణాలు పోవా? అని ప్రశ్నించారు. జ్ఞానం అందరి సొత్తు కావాలి. విద్యా, వైద్యం ను జాతీయం చేయాలని ఆర్.నారాయణ మూర్తి(R.Narayana Murthy) డిమాండ్ చేశారు. ఆగస్టు 22 న విడుదల చేస్తున్న యూనివర్సిటీలో పేపర్ లికేజి సినిమా ను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
Also Read: RMP Clinics: ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. నిబంధనలకు విరుద్ధం
