Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ ఆసక్తికర పోటీ నెల్లికుదురులో చోటుచేసుకుంది. నెల్లికుదురు(Nellikuduru) మండల కేంద్రమైనప్పటికీ అక్కడ సర్పంచ్ ఎన్నిక జరుగుతోంది. నెల్లికుదురులో గత ప్రభుత్వ హయాంలో టిఆర్ఎస్(TRS) హవా నడిచింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ(Congress) అంతంత మాత్రంగానే ఉంది. ఈ రసవత్తర సమయంలో టిఆర్ఎస్ పార్టీ హవా ని నెల్లికుదురు మండలం నుంచి ప్రారదోలెందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ బరిలో నిలిచి నువ్వా నేనా అంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
Also Read: Divya Toxicity: బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి దివ్య ఖోస్లా.. ఎందుకంటే?
ఎవరకి వారే దీమాగా ప్రచారం
వివరాల్లోకి వెళితే నెల్లికుదురు మేజర్ గ్రామపంచాయతీ అక్కడ టిఆర్ఎస్(TRS) పార్టీ నుండి పులి రామచంద్రు(Puli Ramachandru), కాంగ్రెస్ పార్టీ నుండి పులి వెంకన్న(Puli Venkanna) లు బరిలో నిలిచారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని గడప గడప తిరుగుతూ తనను గెలిపించాలని ఎవరికివారు ప్రచారాన్ని సాగిస్తున్నారు. పులి రాంచంద్రు నెల్లికుదురు మండల ఆశీస్సులు తనకే లభిస్తాయని చెబుతున్నారు. పులి వెంకన్న మండల ప్రజల ఆశీస్సులతోపాటు స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్(MLA Bhukya Murali Nayak), ఎంపీ బలరాం నాయక్(MP Balaram Nayak) అండదండలు తనకు ఉన్నాయని చెబుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఏదైతేనేం ఇద్దరు అన్నదమ్ముల మధ్య బస్తీమే సవాల్ అంటూ సర్పంచ్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

