Students Bitten By Tats: హుజూరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తోంది. రాత్రి నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థిను(Students)లపై ఎలుకలు దాడి చేసి కరిచాయి. ఈ సంఘటనపై విద్యార్థుల(Students) తల్లిదండ్రులు,(Parents) విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్కు.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి
సంఘటన వివరాలు:
రాత్రి ఈ ఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఎస్. దీక్షితతో పాటు మరో విద్యార్థిని అరికాళ్ళను ఎలుకలు తీవ్రంగా కరిచాయి. పాఠశాల ఆవరణలో ఉన్న అపరిశుభ్రత, చెత్తాచెదారం కారణంగానే ఎలుకలు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించాయని తెలుస్తోంది. ఈ దాడి జరిగిన వెంటనే విద్యార్థుల(Students)కు చికిత్స చేయించడంలో జాప్యం జరిగింది. సంఘటన రాత్రి జరిగితే, మధ్యాహ్నం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో టెటనస్ టాక్సాయిడ్ (TT) వ్యాక్సిన్ ఇచ్చారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన: ఈ ఘటనపై విద్యార్థుల(Students) తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా ఇతర గురుకుల పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని, అయినా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, విద్యార్థుల(Students) భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలుకల బెడద లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కోరుతున్నారు.
Also Read: Apple iPhones: ఐఫోన్ లవర్స్కు శుభవార్త.. ఒక బ్యాడ్ న్యూస్ కూడా..