Road-Accident
తిరుపతి

Road Accident: ఏపీలో ట్రావెల్స్ బస్సు బోల్తా… పలువురికి గాయాలు

Road Accident: ఆంధ్రప్రదేశ్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తిరుపతిలోని సూళ్లూరుపేటలో కలకత్తా- చెన్నై జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది.

పాండిచ్చేరి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అతి వేగంతో వెళ్లిన బస్సు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం. అయినా ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?