Rangareddy District (imagecredit:swetcha)
రంగారెడ్డి

Rangareddy District: దళితుల భూ సమస్య.. తప్పుడు సర్వేనంబర్‌తో అగ్రిమెంట్లు

Rangareddy District: రంగారెడ్డి జిల్లా కొంగరకుర్థు దళిత రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. తుక్కుగూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో దళిత కుటుంబాలు కెఎల్ఆర్ కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

సర్వేనంబర్ 73లో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు 7 దశాబ్ధాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2009లో హౌసింగ్ బోర్డుకు ఈ భూమిని కేటాయించారని, ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకునేందుకు రావటంతో రైతులు అవాక్కైయ్యారు.

తప్పుడు సర్వేనంబర్‌తో అగ్రిమెంట్లు

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమకు ఇచ్చే పరిహారం చెప్పకుండా భూమిని తీసుకోవద్దంటూ కేఎల్ఆర్‌కు రైతులు, మహిళలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తప్పుడు సర్వేనంబర్‌తో అగ్రిమెంట్లు చేసుకోవటం జరిగిందని, తమకు సంబంధం లేదని కేఎల్ఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ సమస్యపై కేఎల్ఆర్ వెంటనే ఆర్డీవోతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. కొంగరకుర్థు రైతుల సమస్యను ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు.

Also Read: Panchayat Raj Director: పల్లెల్లో పకడ్బందీగా.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి!

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?