Govt Land Scam: గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమి కబ్జా!
Govt Land Scam (image credit:swetcha)
రంగారెడ్డి

Govt Land Scam: గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమి కబ్జా.. కాలనీ పేరుతో లే అవుట్.. కోట్ల విలువైన భూమికి కన్నం!

Govt Land Scam: హైడ్రా అధికారులు పట్టించుకోరా..!
-కోట్ల విలువైన భూమికి కన్నం
-కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
-ప్రభుత్వ భూమి కబ్జా అయితే మాకేంటి
-రియల్ వ్యాపారులపై జాలి చూపిస్తున్న అధికారులకు
-గుట్టుచప్పుడు కాకుండా ఫ్రెండ్స్ కాలనీ పేరుతో లే అవుట్
-ఓ ప్రజా ప్రతినిధి అండతోనే ఇస్టానుసారం
-నకీలి డ్యాకుమెంట్లతో ప్రభుత్వ భూమిలో క్రయ విక్రయాలు

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమంగా వెంచర్లు చేసి అమాయకులకు విక్రయించడం అనేది సర్వసాధారణం అయ్యింది. ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేయాలనే ఆలోచనలో రియల్​ వ్యాపారులు, రాజకీయ నాయకులు కుమ్మకై పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేస్తున్నారు. గత పదేండ్ల కాలంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. 5 నుంచి 10 ఎకరాల పట్టా భూమి కొనడం, దాన్ని అలాగే ఉంచి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో లే అవుట్లు చేసిన అక్రమంగా క్రయ విక్రయాలు జరిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అదే పద్దతిని రాజకీయ నాయకులు, రియల్​ వ్యాపారులు కుమ్మకై కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు కాసులకు కక్కుర్తిపడి గతంలో చేసిన తప్పిదాలనే మళ్లి చేసేందుకు సిద్దమైతున్నారని తెలుస్తుంది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించినట్లు హడాహుడి చేసి 10 నిమిషాల్లో సమస్యను వదిలేస్తున్నారు.

అధికారులకు ఆలవాటుగా..

లక్షల్లో పర్శంటేజ్ లు ఇచ్చి వ్యాపారం చేసే రియల్టర్ల జోలికి వేళ్ళని అధికారులు, అదే ఓ నిరుపేద ప్రభుత్వ భూమిలో 60 గజాల స్ధలంలో నిర్మాణాలు చేస్తే క్షణాల్లో కూల్చి వేస్తున్న పరిస్థితి. కానీ అదే బడా వ్యాపారులు, రాజకీయ నేతలు ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు, లేఅవుట్లు, రోడ్లు, డ్రైనేజీలు వేసి సోంత ప్రాపర్టీలాగా వ్యవహారిస్తే చూసిచూడనట్లు వ్యవహారించడం అధికారులకు ఆలవాటుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో భారీ లేఅవుట్లు వేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకునే నాథుడే కరువైయ్యారు. ఈ దుస్థితి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ మండలం మైలార్​దేవరపల్లిలోని 156 సర్వే నెంబర్​లో జరుగుతున్న తతంగం. రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేసిన ఫలితం లేదు. హైడ్రా అధికారులైనా స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదండీ సంగతి..

హైదరాబాద్​ నగరానికి కూత వెట్టు దూరంలోనున్న రాజేంద్రనగర్(Rajendhra Nagar)​ మండలం మైలార్​దేవరపల్లి(Milardhevula Pally) రెవెన్యూ పరిధిలోని 156 సర్వే నెంబర్​లో 439 ఎకరాల 27 గుంటల భూమి కలదు. ఇందులో ఇతరత్రా ప్రజా అవసరాల కోసం గత ప్రభుత్వాలు 314 ఎకరాల 12 గుంటల భూమిని టీఎన్జీవో కాలనీ, పద్మశాలిపురం, మధుభన్​కాలనీ, ఇండస్ట్రీయల్​కు కేటాయించారు. మరో 4ఎకరాల 33 గుంటల భూమి దేవాలయం, 3 ఎకరాల 07 గుంటలు మైనార్టీ స్కూల్​కు ప్రభుత్వాలు కేటాయించారు. మిగిలిన 117 ఎకరాలు భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో కోందరు వ్యక్తులు సుమారుగా మూడు ఎకరాల స్థలంలో భారీ లే అవుట్​ నిర్మాణం చేశారు. 156/1 సర్వే నెంబర్​లో ఫ్రెండ్స్​ కాలనీ పేరుతో రోడ్లు, చూట్టు ప్రహారీ గోడ నిర్మాణం చేశారు. గతంలో స్ధానిక తహశీల్ధార్​కు, సబ్​ రిజిస్ట్రార్లకు సైతం ఫిర్యాదులు చేశారు. కానీ తూతుమంత్రంగానే కూల్చివేతలు చేసి వదిలేశారు. ఆ తర్వాత ఆ స్థలంలో జరిగే నిర్మాణాలను పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.

Also Read: GHMC: గాంధీ ఆస్పత్రి పరిసరాలలో దర్శనమిచ్చిన కుక్కలు.. కమిషనర్ సీరియస్!

ఏడాది గడిచిన చర్యలు లేవ్​..

గత ప్రభుత్వంలో కబ్జాకు గురైతుందని స్ధానికులు పెద్ద ఎత్తున్న సంబంధిత అధికారులకు 2023 మార్చి నెలలోనే ఫిర్యాదులు చేశారు. తాత్కలిక చర్యలతో అధికారులు మౌనం వహించారు. అయితే ఈ భారీ స్ధాయిలో లే అవుట్​ చేసిన వ్యాపారి వెనుక ఓ ఎమ్మెల్యే స్ధాయి ప్రజాప్రతినిధి ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అయన కనుసన్నంలోనే రియల్​ వ్యాపారి యథేచ్చగా లే అవుట్​ చేసుకోని అక్రమంగా క్రయ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ నిబంధనలతో లే అవుట్​ చేశారనే ప్రశ్నలు ఎదురైతున్నాయి. అటు జీహెచ్​ఎంసీ అధికారులు… ఇటు రెవెన్యూ అధికారుల సమన్వయం లేకపోవడంతోనే అక్రమ కట్టడాలు, నిర్మాణాలతో పాటు లే అవుట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా అధికారులు తాయిలాలకు ఆలవాటు పడి కోట్ల విలువైన భూమిని రియల్​ వ్యాపారి చేతిలో పెట్టేందుకు అన్ని రకాల మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులు ఇచ్చిన ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి.

హైడ్రా అధికారులు స్పందించాలి..

రాష్ట్ర ప్రభుత్వాని విలువైన స్ధరాస్థి ప్రైవేట్​ వ్యక్తులు అప్పన్నంగా ప్రభుత్వ భూమిని లాగేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజా అవసరాలకు ఇచ్చిన భూమిపై ఎవరికి ఏలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రైవేట్​ వ్యక్తులు ప్రజాప్రతినిధుల అండదండలతో లేఅవుట్లు చేసి అక్రమంగా క్రయ విక్రయాలు చేపడుతున్నారు. ఇలాంటి భూములపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి హైడ్రా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్ధానిక ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

Also Read: Dasoju Sravan: రియల్ ఎస్టేట్ రంగం నాశనం: దాసోజు శ్రవణ్

Just In

01

Illegal Sand Mining: మసక మసక చీకట్లో అక్రమ ఇసుక రవాణా.. రాత్రి అయిందంటే రయ్ రయ్!

Hanumakonda District: వికలాంగ కుమారుడి వేదన తట్టుకోలేని గుండేడ్ గ్రామం.. ఏం చేశారో తెలుసా..!

Maoist Ganesh: స్వగ్రామానికి చేరిన మావోయిస్టు అగ్రనేత గణేష్ మృతదేహం.. గ్రామంలో హైటెన్షన్!

MLC Kavitha: గిరిజన తండాలో బస.. చెంచులతో మమేకమైన ఎమ్మెల్సీ కవిత

Komatireddy Venkat Reddy: కేసీఆర్ ముందు నీ బిడ్డ లెక్కకు సమాధానం చెప్పు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి