CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ( congress) ఎంపీలకు కుల గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు బీసీ 42 శాతం బిల్లుపై వివరించనున్నారు. పార్లమెంట్, రాజ్యసభలో ఈ బిల్లును పాస్ చేయించేందుకు ఎలా వ్యవహరించాలి? అనే దానిపై చర్చించనున్నారు. పార్లమెంట్ లోని అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా సంప్రదింపులు చేయనున్నారు. అంతేగాక ఇప్పటికే ప్రధాన మోడీ అపాయింట్మెంట్ను కూడా కోరారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే
అన్ని పార్టీల ఎంపీల సహకారంతో మోడీని కూడా కలిసి 42 శాతం రిజర్వేషన్పై చర్చించనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో జరగనున్న భాగీదారీ న్యాయ సమ్మేళనం అనే కార్యక్రమంలో కూడా పాల్గొనే ఛాన్స్ ఉన్నది. సుమారు మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నది. (42% Reservation Bill,)42 శాతం రిజర్వేషన్పై అన్ని పార్టీల సీనియర్లు, లీగల్ ఒపీనియన్, నిపుణులతో చర్చించనున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న జరగాల్సిన క్యాబినెట్ వాయిదా పడే అవకాశం ఉన్నది. సీఎం ఢిల్లీ నుంచి వెంటనే వచ్చేస్తే, క్యాబినెట్ ఉంటుందని, అక్కడే ఉంటే రీ షెడ్యూల్ చేస్తామని సీఎంవో వర్గాలు తెలిపాయి.
Also Read: Air India: ఎయిరిండియా విమానంలో మంటలు.. మరో షాకింగ్ ఘటన