Paidi Rakesh Reddy: బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రస్తుత రాజకీయాలు తనకు నచ్చడం లేదని ఆయన వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, ప్రస్తుత సర్కార్ వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, పదవులు అన్నీ దక్షిణ తెలంగాణ వారే దోచుకుపోతున్నారని ఆయన విమర్శించారు. బీసీ(BV)ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినా ప్రజలు తమను ఓడించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Also Read: Sudheer Reddy Arrest: హైదరాబాద్లో ఏపీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్.. గంజాయి పాజిటివ్
అంచనాలు పెంచడం
కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీలకు సంతకం పెట్టిన మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు(Harish Rao)ను ఉరి తీసినా తప్పులేదని రాకేశ్ రెడ్డి(Rakesh Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరిగేషన్ రంగంలో దోపిడీకి పాల్పడిన వారికి తాలిబన్ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంచనాలు పెంచడం కోసమే జూరాల నుంచి శ్రీశైలం(Srisailam) వరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మార్చారని, ఇందుకు సలహాలు ఇచ్చిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే గవర్నర్ అపాయింట్మెంట్ను తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండేళ్ల నుంచి ఇరిగేషన్ మంత్రి నవ్వుతూ కనిపిస్తున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
Also Read: Telangana Politics: సర్కారు స్ట్రాటజీతో సతమతమవుతున్న ప్రతిపక్షాలు.. రెండు పార్టీలపై కాంగ్రెస్ ఎటాక్!

