Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో ఇదే జరుగుతుంది
Mahesh Kumar Goud (imagecredit:swetcha)
Political News, Telangana News

Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో సేమ్ ఇదే జరుగుతుంది: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: ఇప్పటి వరకు ఏకగ్రీవమైన సర్పంచుల్లో 90 శాతం కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ, తన స్వగ్రామం రహత్ నగర్‌లో ఎస్టీ అభ్యర్థి విద్యావంతుడు తిరుపతి(Thirupathi) ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం శుభ పరిణామం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం పట్ల సంతృప్తితో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు.

Also Read: CM Revanth Convoy: సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం.. రేవంత్‌కు త్రుటిలో తప్పిన ముప్పు

ఊహించని విధంగా పెట్టుబడులు..

సన్న బియ్యం మొదలు ఇందిరమ్మ ఇళ్ల వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌తో ఊహించని విధంగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మక నిర్ణయం కాబోతున్నదని, ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఫోర్త్ సిటీని నిర్మిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రఖ్యాతి చెందిన కంపెనీలు పాల్గొన్నాయని, పెట్టుబడులు రావడం శుభ పరిణామం అని అన్నారు. పదేళ్ల విధ్యంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పయనిస్తున్నదని చెప్పారు. సకల సదుపాయాలతో ఫోర్త్ సిటీ ముందుకు సాగుతున్నదన్నారు. విద్యావంతులు, యువకులు సర్పంచులుగా ఎన్నిక కావడం మంచి పరిణామం అని మహేశ్ గౌడ్ చెప్పారు.

Also Read: Minister Sridhar Babu: భారత్ ఫ్యూచర్ సిటీతో.. 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు!

Just In

01

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా