Parliament Monsoon Sessions: పార్లమెంట్ యుద్ధానికి సమయం దగ్గరపడింది. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఉభయ సభల నేతలతో సమావేశమయ్యారు.
Also Read: Natti Kumar: ఫిష్ వెంకట్కు హీరోలు ఎందుకు సాయం చేయాలి?.. నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!
ఈ భేటీకి కేంద్రమంత్రి జేపీ నడ్డా (JP Nadda) అధ్యక్షత వహించగా, పగల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, (Operation Sindhur) ట్రంప్ ప్రకటన సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. అన్ని అంశాలపై సభా సమావేశాలకు అనుగుణంగా చర్చించుకుందామని కిరణ్ రిజిజు అన్నారు. ప్రభుత్వం ఏ విషయంపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల సమన్వయం అవసరమని గుర్తు చేశారు.
Also Read: Nikhil Siddhartha: వాటర్ బాటిల్స్ ని కూడా లోపలికి తెచ్చుకోనివ్వరా.. హీరో నిఖిల్ సంచలన ట్వీట్