Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 11 బోగీలు
Odisha Train Accident(Image Credit: Twitter)
జాతీయం

Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 11 బోగీలు

Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తిప్పాయి. కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద జరిగింది.

రైల్వే అధికారుల ప్రకారం.. రైలు నేరగుండి స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. పట్టాలు తప్పిన 11 బోగీలు మొత్తం ఏసీ కోచ్‌లు అని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందగా, కొందరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా ప్రకటించారు.

Also Read: సైబర్ కిలాడీ అరెస్ట్.. ఎలా అరెస్ట్ చేశారంటే?

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు, సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. రైలు పట్టాలు తప్పటానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?