more than 2 thousand deaths in landslide incident in papua new guinea విరిగి పడిన కొండచరియలు.. 2 వేలు దాటిన మరణాలు
landslide
అంతర్జాతీయం

Landslides: విరిగి పడిన కొండచరియలు.. 2 వేలు దాటిన మరణాలు

Papua New Guinea: ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో మహా విషాదం నెలకొంది. కొండ చరియలు విరిగిపడి వేల మంది మరణించారు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి పెళపెళ మంటూ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపాదాల వద్ద ఉన్న ఓ కుగ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇళ్లు, ఇళ్లల్లో నిద్రిస్తున్న గ్రామస్తులు సజీవంగా సమాధి అయ్యారు. పోర్గెరా మైన్‌కు వెళ్లే రహదారి అక్కడ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఈ ఘటన ఎన్‌గా ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య రెండు వేలను దాటింది.

ఈ ఘటనలో రెండు వేలకు పైగా ప్రజలు సజీవ సమాధి అయ్యారని ఆ దేశ విపత్తు కేంద్రం ఐరాసకు తెలిపింది. భవంతులు, ఫుడ్ గార్డెన్లు అన్నింటినీ నేల మట్టమయ్యాయని, దేశ ఆర్థిక జీవధార దెబ్బతిన్నదని వివరించింది. ఇప్పటికీ పరిస్థితులు అస్థిరంగానే ఉన్నాయని, ఇంకా కొండ చరియలు విరిగిపడుతూనే ఉన్నా యని పేర్కొంది. తద్వార విపత్తు నిర్వహణ బృందాలతోపాటు కొనఊపిరితో ఉన్న బాధితులకూ ముప్పు కొనసాగుతూనే ఉన్నదని వివరించింది. దేశంలోని అన్ని వ్యవస్థలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, పపువా న్యూగినియా మిత్రదేశాలకు ఈ పరిస్థితులను వివరించాలని కోరింది. పపువా న్యూగినియా డిజాస్టర్ సెంటర్ ద్వారా సహాయ సహాకారాలను సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. పపువా న్యూగినియాలో మరణాలపై దిగ్భ్రాంతి చెందినట్టు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశ ప్రభుత్వం, ప్రజలకు అండగా నిలబడుతామని వివరించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?