Mayanmar Violence Civilian Attacks Un Chief Condemns Rohingya Muslims
అంతర్జాతీయం

International News: మయాన్మార్‌ హత్యలను ఖండించిన యూఎన్‌ అధికార ప్రతినిధి

Mayanmar Violence Civilian Attacks Un Chief Condemns Rohingya Muslims : మయన్మార్‌లో పౌరుల హత్యలను ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. మయన్మార్‌ సైన్యం రఖైన్ రాష్ట్రం సగయింగ్ ప్రాంతంలో ప్రజలను చంపడాన్ని ఆయన తప్పుబట్టారు. సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ దీనిపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా దీనికి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో అరకాన్ సైన్యం మధ్య హింస జరిగింది.

దీనిలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ హింస ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. మయన్మార్‌లోని మైనార్టీ రోహింగ్యా ముస్లింలపై ఎక్కువ దాడులు జరిగాయి. అనేక తరాల రోహింగ్యా ముస్లింలు చాలా కాలంగా రఖైన్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ.. వారు పౌరసత్వం పొందలేకపోయారు. 2017 తర్వాత లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారు.

Also Read: దడ పుట్టిస్తున్న బర్డ్‌ప్లూ, తొలి మరణం: WHO

పశ్చిమ మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో జాతి ప్రాతిపాదికన ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం, రోహింగ్యా ముస్లింలను హింసించడం తీవ్రంగా కలత చెందుతుంది. ఐక్యరాజ్య సమితి అన్ని వర్గాల చర్యలు తీసుకోవడం గురించి మాట్లాడింది. ఇటీవల జరిగిన దాడుల్లో ఈ వర్గానికి చెందిన కొందరిని పొట్టనబెట్టుకోవడమే కాకుండా వారి ఇళ్లను కూడా తగలబెట్టారు. యుఎన్‌ రెప్యూజీ ఎజెన్సీ ప్రకారం ఇప్పటివరకు 2 లక్షల 26 వేల మంది రోహింగ్యా ముస్లింలు నిర్వాసితులవుతారు. ఈ ప్రజలందరూ ఇప్పుడు వారి ఆచూకి కోసం వెతుకుతున్నారు. మయన్మార్‌లో ప్రజలు అదృశ్యం కావడమే కాకుండా గ్రామంలోని నిరాయుధులపై కూడా కాల్పులు జరిపిన ఇలాంటి ఘటనలను ఐక్యరాజ్యసమితి ఇప్పటికే నివేదించింది. ఆహార సంక్షోభంతో పరిస్థితి చాలా దారుణంగా మారే ఛాన్స్ ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?