Iran Protests: ఇరాన్‌లో అల్లకల్లోలం.. వణుకు పుట్టించే దృశ్యాలు
Iran Protests (Image Source: Twitter)
అంతర్జాతీయం

Iran Protests: ఇరాన్‌లో అల్లకల్లోలం.. వణుకు పుట్టించే దృశ్యాలు.. 45 మందికి పైగా మృతి!

Iran Protests: ప్రజల నిరసనల జ్వాలలో ఇరాన్ అట్టుడుకుతోంది. రాజధాని టెహ్రాన్ ప్రాంతంలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. ఆర్థిక వ్యవస్థ పతనం, అధిక ద్రవ్యోల్బణం వ్యతిరేకంగా డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు.. తాజాగా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇస్లామిక్ సుప్రీంనేత స‌య్య‌ద్ అలీ హుస్సేనీ ఖ‌మేనీ (Seyyed Ali Hosseini Khamenei)కి వ్య‌తిరేకంగా ఇరాన్ లోని పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. వీధుల్లో ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భద్రతా దళాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

తగలబడిన టెహ్రాన్ నగరం..!

గురువారం రాత్రి టెహ్రాన్ నగరంలో చేపట్టిన ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఖ‌మేనీ రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు టెహ్రాన్ వీధుల్లో అల్లకల్లోలం సృష్టించారు. ‘డెత్ టూ ఖమేనీ’, ‘డెత్ టూ డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. కంటికి కనిపించిన వాహనం కనిపించినట్లు నిప్పు పెట్టుకుంటూ వెళ్లారు. దీంతో నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలను ప్రయోగించాయి. కొన్ని చోట్ల కాల్పుల ఘటనలు సైతం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.  ఫలితంగా గురువారం అర్ధరాత్రి టెహ్రాన్ లో ఎటు చూసినా రక్తపు మరకలు, ఎగసిపడుతున్న మంటలే దర్శనమిచ్చాయి. నిరసనలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంటర్నెట్ సేవలు బంద్..

గురువారం అర్ధరాత్రి నుంచి నిరసనలు తీవ్రతరం కావడంతో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియన్ (President Masoud Pezeshkian) నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అలాగే టెలిఫోన్ కాల్స్ పైనా నిషేధం విధించింది. ఇరాన్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి రాకపోకలను సైతం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు మసౌద్ ప్రకటించారు. దీంతో ఇరాన్ కు ప్రపంచ దేశాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోజాజవ. అయితే బహిష్కృత యువరాజు రిజా పహలావి ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిరసన కారుల ఆందోళనలు మహోగ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. వీధుల్లోకి వెళ్లి ఆందోళనలు చేపట్టాలని రిజా పహలావి తన మద్దతుదారులు కోరడంతో ఇరాన్ వీధులు ఆందోళనకారులతో ఉద్రిక్తంగా మారాయి.

2000 మందికి పైగా అరెస్టు..

అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ (HRANA) న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. భద్రతబలగాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 42 మంది వరకూ మృతి చెందారు. మృతుల్లో 29 మంది నిరసనకారులు, 8మంది భద్రతా సిబ్బంది, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఐదుగురు టీనేజర్లు ఉన్నారు. అలాగే ఇప్పటివరకూ 2,270 మందిని పైగా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. గురువారం రోజున ఇరాన్ లోని 21 ప్రావిన్సులో గల కనీసం 46 నగరాల్లో నిరసనలు జరిగినట్లు అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు నార్వేకు చెందిన ఎన్జీఓ ఇరాన్ హ్యుమన్ రైట్స్ ప్రకారం బుధవారం ఒక్కరోజే 13 మంది మరణించారు.

Also Read: VC Sajjanar: సొంత వాహనాల్లో సంక్రాంతికి వెళ్తున్నారా? సజ్జనార్ కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్..

ఆందోళనకారులను ఇరాన్ ప్రభుత్వం అణిచివేస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రాంప్ (Donald Trump) ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆందోళనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ లో ఆందోళనలు చెలరేగిన ప్రతీసారి వాటిని అణిచివేయాలని అక్కడి పాలకులు చూస్తుంటారని ట్రంప్ అన్నారు. ఇది సర్వసాధారణంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఈసారి కూడా అలా చేయాలని భావిస్తే.. అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పాలకులను తీవ్రంగా దెబ్బతీస్తామని బెదిరించారు.

Also Read: The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?