Hyderabad Crime Iimage credit:AI)
హైదరాబాద్

Hyderabad Crime: యాసిడ్ దాడి కేసులో.. పూజారి అరెస్ట్..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Crime: సంచలనం సృష్టించిన యాసిడ్​ అటాక్​ కేసులోని మిస్టరీని పోలీసులు గంటల్లోనే ఛేదించారు. పక్కగా ఆధారాలు సేకరించి ఈ నేరానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్​ చేశారు. సౌత్​ ఈస్ట్​ జోన్​ డీసీపీ పాటిల్​ కాంతిలాల్​ సుభాష్​, అదనపు డీసీపీ టీ.స్వామి, టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు, సైదాబాద్​ ఏసీపీ డీ.వెంకన్నతో కలిసి సైదాబాద్​ స్టేషన్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సైదాబాద్​ బ్కాంక్​ కాలనీ నివాసి నర్సింగ్​ రావు (60) పన్నెండేళ్లుగా దోభీఘాట్​ రోడ్డులో ఉన్న శ్రీ భూలక్ష్మీ మాతా ఆలయం, గోశాల కమిటీల సభ్యునిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయంలో రిసెప్షనిస్టుగా అకౌంటెంట్​ గా పని చేస్తున్నాడు.

ప్రతీరోజూ ఉదయం 6గంటలకు వచ్చి మందిరం తెరుస్తూ పూజలు, అభిషేకాలు ముగిసిన తరువాత రాత్రి 10.30గంటల సమయంలో మందిరానికి తాళం వేసి వెళుతుంటారు. ఆలయానికి, గోశాలకు ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే వారికి రసీదులు ఇవ్వటంతోపాటు ఆ లెక్కలన్నీ నర్సింగ్​ రావే చూసుకుంటుంటాడు. ఈనెల 14న నర్సింగ్​ రావు కౌంటర్​ లో కూర్చుని ఉండగా తలపై టోపీ, ముఖానికి మాస్క్​ వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి తన పేరు నరేష్​ అని పరిచయం చేసుకున్నాడు. అన్నదానానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

Also Read: Mulugu District News: మిర్చికి మద్దతు ధర ఎక్కడ? బీఆర్ఎస్ నేత డిమాండ్

ఆ తరువాత అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇస్తున్నట్టు చెప్పి రసీదు ఇవ్వమని అడిగాడు. నర్సింగ్​ రావు రసీదు రాస్తుండగా దుస్తుల్లో నుంచి సీసాను బయటకు తీసిన వ్యక్తి హ్యాపీ హోలీ అంటూ అందులో ఉన్న యాసిడ్​ ను తల, ముఖంపై పోశాడు. ఆ వెంటనే అక్కడి నుంచి బైక్​ పై పారిపోయాడు. తల, ముఖంపై కాలిన గాయాలైన నర్సింగ్​ రావు కేకలు పెట్టగా విని ఆలయంలో ఉన్నవారు వెంటనే వచ్చి హుటాహుడిన అతన్ని మలక్​ పేట యశోధా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అక్కడ దొరికిన ఆధారాలను సేకరించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్​ రావు వాంగ్మూలాన్ని సేకరించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆరు బృందాలతో విచారణ…

స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించటంతో సౌత్​ ఈస్ట్​ జోన్​ ఉన్నతాధికారులు సైదాబాద్​ పోలీసులతోపాటు టాస్క్​ ఫోర్స్​ సిబ్బందిని ఆరు బృందాలుగా ఏర్పరిచి రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల్లోని అధికారులు భూలక్ష్మి మాతా ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాతోపాటు మొత్తం 400 కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో యాసిడ్​ పోసిన వ్యక్తి మందిరం వద్ద నుంచి సైదాబాద్​ మెయిన్​ రోడ్డు, చెంచల్​ గూడ, చాదర్​ ఘాట్​, మలక్​ పేట మెయిన్​ రోడ్డు, విక్టోరియా గ్రౌండ్​, మొజంజాహీ మార్కెట్​, గాంధీ భవన్​, ఏక్​ మినార్​ మసీదు, మెహదీపట్నం, టోలీచౌకీ మీదుగా బైక్​ పై వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తి గాంధీ భవన్ మెట్రో స్టేషన్​ వద్ద ఓ షాపు నుంచి టోపీ కొన్నట్టు గుర్తించారు. ఈ ఆధారాలతో యాసిడ్​ దాడికి పాల్పడ్డ షేక్​ పేట నివాసి, వృత్తిరీత్యా పూజారి అయిన రాయికోడ్​ హరిపుత్ర (31)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల మేరకు భూలక్ష్మి మాత ఆలయంలోనే పూజారిగా పని చేస్తున్న సరస్వతీనగర్​ కాలనీ నివాసి అరిపిరాల రాజశేఖర శర్మ (41)ను అరెస్ట్​ చేశారు.

2వేల రూపాయలకు కక్కుర్తి పడి…
ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న హరిపుత్ర 2వేల రూపాయల కోసం కక్కుర్తి పడి ఈ నేరానికి పాల్పడినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భూలక్ష్మి మాత ఆలయంలో పూజారిగా పని చేస్తున్న రాజశేఖర శర్మకు కొంతకాలంగా నర్సింగ్​ రావుతో విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తనకు పరిచయం ఉన్న హరిపుత్రను పిలిచిన రాజశేఖర శర్మ తాను చెప్పినట్టుగా నర్సింగ్​ రావుపై యాసిడ్​ దాడి చేస్తే 2వేల రూపాయలు ఇస్తానన్నాడు. ఫోన్​ పే ద్వారా వెయ్యి రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చాడు.

Also Read: Ganja Seized: హైదరాబాద్ లో ఈ ఐస్ క్రీమ్ తిన్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ కావాల్సిందే!

డబ్బు తీసుకున్న హరిపుత్ర యాసిడ్​ అటాక్​ చేశాడు. నిందితులిద్దరిపై బీఎన్​ఎస్​ 109, పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు డీసీపీ పాటిల్​ కాంతిలాల్​ సుభాష్​ తెలిపారు. ఇద్దరి నుంచి మొబైల్​ ఫోన్లను సీజ్ చేసి వాట్సాప్​ చాటింగులను రిట్రైవ్​ చేసినట్టు చెప్పారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి గంటల్లోనే నిందితులను పట్టుకున్న టాస్క్​ ఫోర్స్​ సీఐ రాఘవేంద ర్​ తోపాటు ప్రత్యేక బృందాల్లోని సిబ్బందిని అభినందించారు.

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?