Phone Tapping case: ఫోన్ట్యాపింగ్కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభాకర్తరపున న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘ నా క్లయింట్కు ముందస్తు బెయిల్మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్తిరిగొస్తారు. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తారు.
30 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించటం ద్వారా అనేక గుర్తింపులు కూడా దక్కించుకున్నారు. 65 ఏళ్ల వయసులో ఉన్న ప్రభాకర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న శ్రవణ్రావును అరెస్ట్చేయవద్దంటూ సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రాజకీయ కక్షల నేపథ్యంలోనే కేసులు నమోదు చేశారు.
ఫోన్ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న దాంట్లో నిజం లేదు’ అని కోర్టుకు నిరంజన్వివరించారు. కాగా, పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్సిద్దార్థ్లూథ్రా 65 ఏళ్ల వయసు ఉందన్న సాకుతో విచారణ నుంచి ప్రభాకర్ తప్పించుకోలేరన్నారు. ఆయన ఫోన్ట్యాపింగ్ చేయించారని అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
హార్డ్డిస్కులను ధ్వంసం చేసి మూసీ నదిలోకి విసిరేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రభాకర్రావుకు ముందస్తు బెయిల్మంజూరు చేయవద్దన్నారు. వాదనలతో కోర్టు సమయం ముగియటంతో తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు