Phone Tapping case( image credit; al or TWITTER
హైదరాబాద్

Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కుట్రపై తుది తీర్పు వచ్చేనా? 29న మరో కీలక రోజు!

Phone Tapping case: ఫోన్​ట్యాపింగ్​కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్​రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్​పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిపై  హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభాకర్​తరపున న్యాయవాది నిరంజన్​రెడ్డి వాదనలు వినిపించారు. ‘ నా క్లయింట్‌కు ముందస్తు బెయిల్​మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్​తిరిగొస్తారు. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తారు.

30 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించటం ద్వారా అనేక గుర్తింపులు కూడా దక్కించుకున్నారు. 65 ఏళ్ల వయసులో ఉన్న ప్రభాకర్ ​క్యాన్సర్​ వ్యాధితో బాధపడుతున్నారు. ఫోన్​ట్యాపింగ్ ​కేసులో నిందితునిగా ఉన్న శ్రవణ్​రావును అరెస్ట్​చేయవద్దంటూ సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రాజకీయ కక్షల నేపథ్యంలోనే కేసులు నమోదు చేశారు.

 Also Read: Pakistan Man In Hyderabad: హైదరాబాద్ లో పాకిస్తాన్ యువకుడి వివాహం? అరెస్ట్ చేసిన పోలీసులు?

ఫోన్​ట్యాపింగ్​ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న దాంట్లో నిజం లేదు’ అని కోర్టుకు నిరంజన్​వివరించారు. కాగా, పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్​సిద్దార్థ్​లూథ్రా 65 ఏళ్ల వయసు ఉందన్న సాకుతో విచారణ నుంచి ప్రభాకర్‌ తప్పించుకోలేరన్నారు. ఆయన ఫోన్​ట్యాపింగ్‌ చేయించారని అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

హార్డ్​డిస్కులను ధ్వంసం చేసి మూసీ నదిలోకి విసిరేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రభాకర్​రావుకు ముందస్తు బెయిల్​మంజూరు చేయవద్దన్నారు. వాదనలతో కోర్టు సమయం ముగియటంతో తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు